Home » Telangana » Karimnagar
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కోరుట్ల పట్టణంలో అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. కోరుట్ల మార్కెట్ కమిటీలో 20 రోజుల క్రితం ధాన్యం తీసుకవచ్చినా తూకం వేయడంలో నిర్వాహకులు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
బాలల హక్కుల రక్ష ణ అందరి బాధ్యతని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్రెడ్డి పేర్కొన్నారు.
బై పాస్ రోడ్డు పనులను శుక్రవారం రైతులను అడ్డగించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అప్పన్నపేటలో 15 ఏళ్ల క్రితం పైప్లైన్ కింద భూములు కోల్పోయిన ఇప్పటివరకు బకాయిలు రాలేదన్నారు. ఇప్పుడు బైపాస్ రహదారి కోసం భూములు తీసుకుంటే ఎక్కడి నుంచి నష్టపరిహారం ఇస్తారంటూ అప్పన్నపేట రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉపాధిహామీ పనుల అమలు మరింత మెరుగు పడాలన్నారు. రాబోయే 25 రోజుల్లో కూలీల హాజరు గణనీయంగా పెంచాలన్నారు.
గోదావరిఖని గౌతమి నగర్లోని శ్రీరామ రైస్మిల్లులో రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని తూకం వేయడంలో మోసాలకు పాల్పడు తున్నట్లు తూనికలు కొలతల శాఖ అధికారులు గుర్తిం చారు. శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు రైస్మిల్లులో మోసాలను గుర్తించారు. రైస్మిల్లును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా తూనికల కొలతల శాఖ అధికారి రఘువీర్సింగ్ పేర్కొన్నారు.
బక్రీద్ పండుగను పురస్కరిం చుకుని పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవా రం దుబ్బపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి రాముగుండం సీపీ తనిఖీ చేశారు.
వేసవిలో అందరికి అందుబాటులో ఉండేవి మామిడిపండ్లు. నోరూరించే మామిడి పండ్ల మెరుపు చూడగానే కొనాలనిపిస్తుంది.
వివిధ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతన్నల్లో సంతోషాన్ని నింపింది.
వేసవిలో అందరికి అందుబాటులో ఉండేవి మామిడి పండ్లు.
జిల్లాలో బోగస్ పింఛన్లను ఏరివేసేందుకు ప్రభుత్వం అతేంటికేషన్(నిజనిర్ధారణ)కు శ్రీకారం చుడుతున్నది.