Home » Telangana » Karimnagar
అంతరాష్ట్ర సాయుధ ముఠాలు బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలో శనివారం బ్యాంక్లు, జ్యువెలరీ షాపుల ప్రతినిధులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బొమ్మకల్ ప్రదాన రహదారిపై బీజేపి నాయకులు, రైతులు శనివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపిందని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో కమాన చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు.
జిల్లాలో గల వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తున్నా వాటి నిర్వహణకు ఆరు మాసాల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో మార్కెట్ల కార్య దర్శులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లకు వచ్చే రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించే పరిస్థితి లేదు.
వరి, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని, వడుకాపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్ పరిశీలించారు.
కొనుగోలు కేంద్రంలో నెలరోజుల క్రితం ధాన్యం పోసినప్పటికీ ఇప్పటికీ తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూకంలో జాప్యం, తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మండలంలోని కనగర్తిలో శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు.
మండలంలోని నర్సింగాపూర్ సర్వే నంబర్ 273లో 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో నుంచి 107 ఎకరాల భూమిని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆక్రమించి సాగు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో శనివారం తహసీల్దార్ దురిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి శారద అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వారం రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో పాల్గొ న్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లోని వందల ఎకరాల పట్టాభూములు, నివేశన స్థలాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలను అధికారులు 2025 జూలై మాసంలో 22/ఎ(1)(డి)నిషేధిత
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) యాసంగి ధాన్యం విక్రయించడం.. వరికోతలపై దృష్టి సారిస్తూనే వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.