Home » Telangana » Karimnagar
దర్యాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 140, 141, 144, 145, 149 లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని మంథని ఆర్డీఓ సురేష్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కోరారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో భూములు కొల్పోతున్న రైతులతో సర్పంచ్ రాపల్లి రాజయ్య ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు.
జిల్లాలో యూరియా కొరత లేద ని, రైతులు ఆందోళన చెందకుండా యాప్ ను అప్డేట్ చేసుకుని యూరియా కోసం బుకింగ్ చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు.
ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేసే వరకు విద్యార్థులకు కోడి గుడ్లను అందించలేమని మధ్యాహ్న భోజన రాష్ట్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్లు స్పష్టం చేశారు.
గోదావరిఖని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన వంటశాల, తాగునీటి సౌకర్యం మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.
మనిషి మనుగడకు కమ్యూనికేషన్ (సమాచార మార్పిడి) కీలకం. ఇందుకు సోషల్ మీడియా ఓ మాద్యమంగా మారింది.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
ఏరువాక పౌర్ణమి పోయినా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. మృగశిర కార్తెతో దుక్కులు దున్ని నార్లు పోసి ఆరుద్ర కార్తెతో రైతన్నలు ఏరువాక సాగేందుకు పున్నమి కోసం ఎదురుచూస్తుంటారు. మృగశిర, ఆరుద్ర పోయి ఏరువాక పౌర్ణమి గడిచినా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు.
యాసంగి సీజన్లో కాలం కలిసి రావడంతో మంచి దిగుబడులు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల ద్వారానే సుమారు రూ.2వేల కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తులను సేకరించడం గమనార్హం. రైతులు బహిరంగ మార్కెట్లో మరో రూ.500 కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తులను విక్రయించి ఉంటారన్న అంచనా ఉంది.
ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ముందుకు సాగే విధంగా రైతులను సంఘటిత పరుస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు వేదికగా గత ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసింది. చాలాకాలంగా ఇవి రైతులకు చేరువకాకుండా కునారిల్లుతూ వచ్చాయి.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ ఓటర్లకు సవాల్గా మారింది. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పని సరిగా నమోదు చేయాల్సి రావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.