Home » Telangana » Karimnagar
రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. రెండుమూడు చోట్ల చెదురుముదురు సంఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో బుధవారం పోలింగ్ ముగి సింది. బ్యాలెట్ బాక్స్లను స్ర్టాంగ్ రూంలకు తరలించారు. అభ్యర్థుల భవితవ్యం బాక్స్లో భద్రంగా ఉంది. ఈనెల 13న జరగనున్న కౌంటింగ్లో గెలుపెవరిదో తేలనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.
మున్సి‘పోల్స్’కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్తోపాటు చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో నేడు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తీసుకొని మంగళవారం రాత్రికి చేరుకున్నారు.
ఓటరన్న తీర్పునకు వేళయింది. సిరిసిల్ల, వేములవాడ బల్దియా సమరానికి సర్వం సిద్ధమయింది. రెండు మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీని, స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు.
మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలాసత్పతి ఎన్నికల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ సాధారణ ఎన్నికలు -2026లో భాగంగా ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన చొప్పదండి మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ పమేలాసత్పతి మంగళవారం సందర్శించారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం బీజేపీ జిల్లా కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు.
కార్మిక సంఘాలు ఈ నెల 12న తలపెట్టిన సమ్మెకు దూరంగా ఉండాలని ఆర్జీ-3, ఏపిఏ జీఎం మధుసూ దన్, నాగేశ్వర్రావు కోరారు. మంగళవారం జీఎం కార్యాలయంలో వివిధ విభాగాల ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు.
అత్యవసర సరిస్థితులలో జిల్లా లోని 108 సేవలను ప్రజలు సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలని ఇన్ చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.