బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:59 PM
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం బీజేపీ జిల్లా కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు.
సిరిసిల్ల అర్బన్, ఫిబ్రవరి 10 (ఆంఽధ్రజ్యోతి) : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం బీజేపీ జిల్లా కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ ము న్సిపల్లో 6వ వార్డు బీజేపీ అభ్యర్ధి ఎరుకుల మహాదేవప్ప అనుమానాస్పద మృతిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లా డుతూ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపా ల్టీలో కాంగ్రెస్ మాఫియా రాజకీయాలు, నిరం తరం బెదిరింపుల మధ్య బీజేపీ అభ్యర్ధి ఎరుకు ల మహదేవప్ప అనుమానాస్పదంగా మృతిచెం దడం తీవ్ర విషాదకరమన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మంత్రిని బర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి పోన్నాల తిరు పతిరెడ్డి, ఉపాధ్యక్షుడు శీలం రాజు, కార్యదర్శి మీసా సంజీవ్, చందుపట్ల లక్ష్మారెడ్డి, ఉడుగుల యాదగిరి, దేవసాని కృష్ణ, ప్రకాష్, ఎల్లారెడ్డి పేట మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం, గంభీరావుపేట మండల అధ్యక్షుడు కోడే రమే ష్, నందినరేష్, దాసరి గణేష్, మల్లేష్ యా దవ్, జితేందర్రెడ్డి, వంతడ్పుల సుధాకర్, వంశీ, బాల గౌడ్, కిరణ్నాయక్, సత్యనారాయ ణ, బాలకృష్ణ, రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వంగల రాజు తదితరులు పాల్గొన్నారు.