Home » Telangana » Karimnagar
గత అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను విస్మ రించారని, ఇప్పటికైనా హామీలను అమలు చేసి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ అన్నారు.
జీవితాంతం ప్రజా ఉద్యమాలకే అంకితమని లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అలియాస్ సంగ్రామ్ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మం థనికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి, సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి, చిన్నకలువల గ్రామాలలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు.
కవల ఆడపిల్లలను కన్నతండ్రే దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీశైలం అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్డలను బావిలో పడే చంపేశాడు.
క్యాతనపల్లిలో తమపై రాళ్ల దాడి చేశారని.. తనను జైలుకు పంపారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. క్యాతనపల్లిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని ఆయన కోరారు.
నిరుపేద కుటుంబాలకు ఆకలికి అలమటించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ సన్న బియ్యం అందిస్తున్నాయి. అయితే ఈ బియ్యం కూడా పక్కదారి పడుతున్నాయి. ప్రతి నెలా 15 నుంచి 25వ తేదీ వరకు బియ్యాన్ని రైస్ మిల్లులకు కొందు డీలర్లు, అలాగే కొందరు బియ్యం వ్యాపారులు లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగనవాడీ కేంద్రాలను ప్రభుత్వం ఒంటిపూట నిర్వహిస్తోంది. రోజురోజుకు తీవ్రమవుతున్న ఎండల కారణంగా చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాల పని వేళలను మార్చింది. రానున్న రెండు నెలలను దృష్టిలో ఉంచుకొని ఒంటి పూట ప్రకటించడంతో పాటు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
కోల్ కారిడార్ను కలిపేందుకు ఇరవై ఐదేళ్ల క్రితం ప్రతిపాదించిన రామగుండం-మణుగూర్ బ్రాడ్ గేజ్ రైల్వేలైన్ మార్గం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం 2026-27 ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ రైలు మార్గానికి 2911 కోట్ల 84 లక్షల రూపాయలు, పెద్దపల్లి- నిజామాబాద్ డబుల్ లైన్ సర్వేకు రూ.3.56 కోట్లు కేటాయించారు.
సాదా బైనామాల నిరీక్షణకు ఉపశమనం కలగనుంది. తాజాగా హైకోర్టు సాదా బైనామాలపై సానుకూలంగా తీర్పునివ్వడంతో మోక్షం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదేళ్లుగా రైతులకు ప్రభుత్వ పథకాలను దూరం చేస్తున్న సాదాబైనామాలకు మోక్షం కలుగుతుందనే ఆశలు మొదలయ్యాయి.
సిరిసిల్లలో తయారు చేస్తున్న ఆర్వీఎం వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని సీఐటీయూ పవర్లూంవర్కర్స్ యూనియన్ రాష్ట్రఅధ్యక్షుడు మూషం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.