Home » Telangana » Karimnagar
మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువుతీరనున్నాయి. ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరగగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. ఆ వెంటనే గెలిచిన అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు క్యాంపులకు తరలించారు. జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, సుల్తానా బాద్, మంథని మున్సిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొంది ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీ సాధించింది. కౌంటింగ్ పూర్తికాగానే గెలుపొందిన వారిని ఆ పార్టీ నాయకులు క్యాంపులకు తరలించారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని 9వ వార్డు నుంచి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలైన బీఆర్ఎస్ అభ్యర్థి సూర శ్యామ్ అన్నారు. ఆదివారం విలేకరుల సమావే శంలో మాట్లాడుతు 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి నంబరుపైన 22 ఓట్లు నమోదు చేయించారన్నారు.
రామగుండం నగర పాలక సం స్థకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆదివారం ఎమ్మెల్యే రాజ్ఠా కూర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు, ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
సుల్తానాబాద్ మున్సి పాలిటీ పరిధిలో గెలుపొందిన కౌన్సిలర్లు పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. ఈ నెల 13న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచే కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు మరో ఏఐఎఫ్బీ అభ్యర్థి శ్రావణితో కలుపుకొని క్యాంపునకు తరలివెళ్ళారు. ఎమ్మెల్యేను కలిసి అదే రోజు రాత్రి షిర్డీ వెళ్ళారు.
ఓం నమః శివాయ... హర హర మహదేవ నామస్మరణతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. ఆదివారం మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. గోదావరి నదీ స్నానాలు ఆచరించారు. పలు ఆలయాల్లో శివ కల్యాణాలను నిర్వ హించారు. భక్తులు కల్యాణాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్దేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీగా తమకు ఆ హక్కు ఉందన్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకొని కరీంనగర్ కార్పొరేషన్లో అధికారం చేపడుతామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్న ది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) మహాశివరాత్రికి జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యా యి. మహాశివరాత్రి పండుగను జరుపుకోవడానికి భక్తులు సిద్ధమయ్యారు.
జగిత్యాల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో చైర్మన, వైస్చైర్మన ఎన్నిక రాజకీయం ఆసక్తికరంగా మారింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది.