Home » Telangana » Karimnagar
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
మహిళల ఆరోగ్య పరిరక్షణ కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
పాలిటెక్నిక్ విద్యను నిర్వీ ర్యం చేయడంతోపాటు ప్రైవేటీకరణ దిశగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 97 జీవోను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు.
చేయూత పెన్షన్ దరఖాస్తులు స్వీక రించి ఆన్లైన్ చేయాలని, ఈనెల 31వ తేదీ తుది గడువు క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం ఆధ్వర్యం లో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకపోతుందని, అర్హులైన పేదలందరికి పథ కాలు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. అబ్బాపూర్లో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం మంత్రి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణా రావుతో కలిసి ప్రారంభించారు.
రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సింగరేణి సంస్థ ఖాళీగా ఉన్న భూములను కేటాయించాలని, నిరు పేదలు ఇందిరమ్మ పథకంలో చేసు కుంటున్న నిర్మాణాలను అడ్డుకోవద్దని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాల యంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో సింగరేణి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
కార్మికులు ఉద్యోగుల హక్కుల సాధన, చట్టాల రక్షణకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో కార్మికులచే భారీ ప్రదర్శన అనంతరం ఏఐటీ యుసీ జిల్లా స్థాయి మహాసభలను నిర్వహిం చారు.
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన అన్నారు.