గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు. సోమవారం సిర్పూర్(టి) మండలం మేట్పల్లి గ్రామంలో దక్షిణ గోండ్వానా గోండు రోజు మొకాసి స్మారక జెండా పూజ కార్యక్రమంలో సబ్కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి పాల్గొన్నారు.
నీతి ఆయో గ్ కార్యక్రమాల్లో భాగంగా సంపూర్ణత అభియాన్ లక్ష్యానికి అనుగుణంగా లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రబారి రజత్ సైని సూచించారు.
ఖానాపూర్లో బీఆర్ఎస్తో జరిగిన పొత్తు స్థానిక నాయకుల మధ్య మాత్రమే జరిగిందని.. పార్టీ స్థాయిలో కాదని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు వివరించారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల బలంతో గుండాయిజం చేసినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు అయిన వారిలో ఎంతోమంది జైలుకు వెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లొచ్చి సీఎంలు అయినంత మాత్రాన... మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటని చెప్పారు.
భానుడు భగ్గు మంటున్నాడు. ఉదయం తొమ్మిదింటి నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రహదారులు జన సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి తగ్గడం లేదు.
విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట కార్మికులు చేపడుతున్న సమ్మె దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో పాల్గొని ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.
నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి మారేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నమని మేయర్ ధర్ని మధుకర్ అన్నారు.
విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు ఆయిళ్ల సత్యనారాయణ, శ్రీకాంత్, పవన్ డిమాండ్ చేశారు.