నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:39 PM
మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియో గం చేసుకొవాలని మండల పశువె ౖద్యాధికారి మురళీకృష్ణ అన్నారు.
ఆసిఫాబాద్రూరల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియో గం చేసుకొవాలని మండల పశువె ౖద్యాధికారి మురళీకృష్ణ అన్నారు. మంగళవారం మండలం లోని అంకుశాపూర్ గ్రామంలో సర్పంచ్ గంగారాంతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా 1800 జీవాలకు ఉచితంగా నట్టాల నివారణ మందులను వేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది మోతిరాం, ప్రశాంత్, వినోద్లు పాల్గొన్నారు.
వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోండి
బెజ్జూరు (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిర్వహించే పశు వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని బెజ్జూరు సర్పంచ్ దుర్గం సరోజతిరుపతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో పశువైద్య సిబ్బంది పశువులకు నట్టన నివారణ టీకాలు వేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ పశువులకు వచ్చే వ్యాధుల నివారణకు యజమానులు నట్టల నివారణ టీకాలు వేయించాలని సూచించారు. గ్రామాల్లో నిర్వహించే శిబిరాల్లో టీకాలు వేయించినట్లయితే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపాలమిత్రలు మనోహర్, నేతాజి పాల్గొన్నారు.
కెరమెరి (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండల కేంద్రంలో మంగళవారం పశువైద్యాధికారి సురేష్కుమార్, సర్పంచ్ పెందూరు అనంద్రావు ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 200 పశువులకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రాజు తదితరులు ఉన్నారు.