విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:29 PM
మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుగులోత్ శ్రీనివాస్ (35) అనే కౌలు రైతు ఆదివారం ఉదయం పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
నెన్నెల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుగులోత్ శ్రీనివాస్ (35) అనే కౌలు రైతు ఆదివారం ఉదయం పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... శ్రీనివాస్ పొట్యాల గ్రామ శివారులో కౌలుకు తీసుకున్న పంటపొలానికి రక్షణగా సోలార్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. పొలంలోని కరెంట్ మోటార్ వైర్ తెగి సోలార్ కంచెపై పడింది. ఇది గమనించని శ్రీనివాస్ పొలంలో ఎరువు లు చల్లుతుండగా సోలార్ కంచెకు తగిలాడు. ఆ కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో శ్రీనివాస్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త శ్రీనివాస్ ఇంటికి రాకపోవడంతో భార్య లక్ష్మి పొలం వద్దకు వెళ్లి చూడ గా విగతజీవిగా కనిపించాడు. ఆమె సోలార్ కంచెను చూడగా దానిపై విద్యుత్ వైర్ కనిపించింది. సమీపంలోని పశువుల కాపర్లను పిలిచి మోటరు కు ఉన్న విద్యుత్ కనెక్షన్ను తొగించారు. శ్రీనివాస్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.