ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిషకరించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లాలో 2025-27కు సంబందించి మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది.
షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రతిభగల విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ‘శ్రేష్ట’ (స్కీం ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెట్ ఏరియాస్) పథకాన్ని ప్రవేశపెట్టింది.
రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీదే పైచేయి కావాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ అన్నారు.
కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పత్తి సేకరణకు కూలీలు దొరకడం లేదు. జిల్లాలో వరి కోతలు...పత్తి ఏరడం ఏకకాలంలో మొదలయ్యాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
రైతులు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహ న పెంచుకుని వ్యవసాయం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు.
పట్టణంలోని ఏఎంసీ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.
సర్వేలో భూ రికార్డులను డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అధికారులు, సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో మావోయిస్టులు కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఏజెన్సీలో కూడా హై అలెర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు ఆరునెలలుగా బిల్లులు మంజూరుకావడం లేదు. దీంతో వార్డెన్లు తీవ్ర ఒత్తిడికి గుర వుతున్నారు.