జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలు మృత్యువాతపడ్డాయి. మత్తు ఇంజక్షన్ల ద్వారా వీటిని హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
కేస్లాపూర్ నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా ఈ ఏరియాలోని ఆదివాసీలు పెద్దఎత్తున తరలిరావడంతో కేస్లాపూర్ అటవీప్రాంతం కిక్కిరిసిపోయింది. మంత్రి కొండా సురేఖతోపాటు జిల్లా అధికారులు జాతరకు విచ్చేశారు.
వసంత పంచమి సందర్భంగా.. బాసర క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. గురువారం సాయంత్రానికే బాసర భక్తులతో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వసంత పంచమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమం తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యింది.
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడపకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపించేది.
సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు డ్రామా ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాఽథ్ వెరబెల్లి పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు సింగరేణిని దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు.
శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదం చేస్తాయని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- కంటైనర్ లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.
మున్సి పల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావటంతో జిల్లాలో ఆయా పార్టీల్లో రాజకీయ సమీకరణలు తెరపైకి వచ్చాయి. ఈ సారి మున్సి పల్ ఎన్నికల్లో పోటీ పార్టీల మధ్య కంటే పార్టీల లోపలే ఎక్కువగా కన్పిస్తోంది.