పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు రెండేళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్లోని మూడు జిల్లాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 150 మీటర్ల ఎత్తులో ప్రాణహిత బ్యారేజీ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతులు మృతిచెందగా.. మరో రైతుకి తీవ్రగాయాలు అయ్యాయి.
సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఆ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది.
బక్రీద్ పండగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పటిష్టమైన నిఘా పెట్టినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
వ్యవసాయ సాగులో శాస్ర్తీయ విధానాలు అవలంభించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్థి చెందవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యుల నియామకం ఉంటుందా లేదా అని ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి ఐదు నెలలు కావస్తున్నా వీరి నియామకం ఊసే లేదు.
ప్రజా సమస్యలను త్వర గా పరిష్కరించాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. సోమవా రం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాఫిర్యాదుల విభాగం లో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యా దుదారుల సమస్యలు విని పరిష్కారానికి సంబంధిత అధికా రులకు సూచనలు ఇచ్చారు.
ప్రజావాణిలో వచ్చే ప్రతీ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అధికారుల కు సూచించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మాట్, డేవిడ్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన పర్యటించే అవకాశాలు ఉన్నాయి.