జిల్లాలో వైద్యం విచ్చలవిడిగా మారింది. అర్హతలు లేకున్నా వైద్య చికిత్సలు చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. తెలిసీ తెలియని వైద్యం చేస్తూ స్థానిక డాక్టర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు దారి తీస్తోంది.
మంచిర్యాల జిల్లా జన్నా రంలో భారీ సైబర్ క్రైంకు పాల్పడుతున్న ముఠాలోని నిందితులను మంచిర్యాల పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం తన కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ వివరాలు వెల్లడించారు.
వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్రాజ్ సూచించారు. బుధవారం మండలంలోని ఇందారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రంను సందర్శించారు.
మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
సహకార సంఘాల నుంచి ఇఫ్కో ఎరువులను కొనుగోలు చేసే ప్రతీ రైతుకు ఆ సంస్థ ఉచితంగా సంకటహరణ బీమా పథకాన్ని వర్తింపజేస్తోంది.
పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఽధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర గిరిజనుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు.
కుమరంభీం కన్జర్వేషన్ రిజర్వ్ పేరిట ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 49ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితీ, తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు కదం తొక్కారు.
పెరిగిన ఎరువుల ధరలతో రైతన్న కుదేలవుతున్నారు. ఇప్పటికే సాగుభారం అధికంకాగా దానికి తోడు వివిధ రకాల ఎరువుల ధరలు కూడ పెరిగాయి.
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా, దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి హరీష్రాజ్ సూచించారు.