వైద్యులతో పాటు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ అనిత సూచించారు.
జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల, దాని అనుబంధ ఆస్పత్రి శాశ్వత భవనాల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. మంచిర్యాల జిల్లాగా ఏర్పడ్డ తరువాత మెడికల్ కళాశాలతోపాటు దానికి అనుబంధంగా 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరయ్యాయి.
మొంథా తుపాన్ కారణంగా మంచిర్యాల జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది.
అమృత్ 2.0 పథకం కింద జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని, ఇందుకు అవసరమైన వివరాలను సంబంధిత శాఖల అధికారులు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు.
పత్తి అమ్మకాల కోసం కేంద్రప్రభుత్వం కొత్తగా తెచ్చిన కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ నిబంధన రైతులకు ఇబ్బందికరంగా తయారైంది.
అవినీతిని నిర్మూలిస్తేనే దేశ పురోభివృద్ధి సాధ్యమని, దేశంలోనే అత్యంత పారదర్శకత ఉన్న సంస్థ సింగరేణి అని ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు అన్నా రు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిషకరించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లాలో 2025-27కు సంబందించి మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది.
షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రతిభగల విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ‘శ్రేష్ట’ (స్కీం ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెట్ ఏరియాస్) పథకాన్ని ప్రవేశపెట్టింది.