నెన్నెల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకే గ్రీవెన్స్లు నిర్వహిస్తున్నామని ఎన్పీడీసీఎల్ నిజామాబాద్ విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్-2) టెక్నికల్, ఫైనాన్స్ మెంబర్లు సలంద్ర రామకృష్ణ, లకావత్ కిషన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపఽథ్యంలో గోదావరి నది తీరం వైపు ఎవరు వెళ్లకుండా బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు.
మంచిర్యాల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో దీర్ఘకాలికంగా నెలకొన్న అనేక సమస్యలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా పరిష్కారానికి నోచుకోలేదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, పెండింగ్ బిల్లుల పరిష్కారం, తెలంగాణలో 2వ పీఆర్సీ, పెండింగ్ డీఏల ప్రకటన, ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీ వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
బడిలో బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సి న పుత్తడి బొమ్మలకు మూడుమూళ్ల బంధనాలు వేసి వారి భవితను ఎండవావిగా మార్చుతున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు, అవగాహనలోపం, నిరక్షరాస్యత బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి.
జిల్లా కేంద్రం లోని గోదావరి సమీపంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)కు వరద ముప్పు పొంచి ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్లను తెరిచి రెండు లక్షల పై చిలుకు క్యుసెక్కుల నీటిని అధికారులు దిగువన గోదావరిలోకి వదిలిపెడుతున్నారు.
వర్షాల నేపఽథ్యంలో ప్రాణ, ఆస్తి, పశునష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో మెరుగైన విద్యను అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య సూచించారు.
ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్) పాలకవర్గాల పదవీ కాలం ఆగస్టు 14తో ముగియనుంది. ఇంకా మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తానమి ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం సిర్పూర్(టి) గ్రామ పంచాయతీలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు.
షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ద్వారా దళితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తామని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు.