Home » Sports » Cricket News
మహిళల ప్రపంచ కప్లో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రపంచ టెక్ దిగ్గజాలు పొగడ్తలతో ముంచెత్తారు. ఇదొక నిర్మాణాత్మక క్షణమని, దీంతో క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాలు లిఖించబడ్డాయి. దిగ్గజాలు జన్మించాయి..
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వరుణుడు తీవ్ర అడ్డంకులు కలిగిస్తున్నాడు. రెండు గంటలు ఆలస్యంగా టాస్ వేశారు. దీంట్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
ఆసీస్-టీమిండియా మధ్య ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం హోబర్ట్ వేదికగా మూడో టీ20 కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు దక్కలేదు. తాజాగా అతడి భవిష్యత్తుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్పై ఉత్కంఠతో పాటు వర్షం భయం కూడా అలముకుంది. నవీ ముంబైలోని మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో మళ్లీ చిన్నపాటి వర్షం మొదలైంది. దీంతో పిచ్పై మళ్లీ కవర్లు కప్పుతున్నారు. దీంతో మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది.
ఇండియా, సౌతాఫ్రికా మహిళల ప్రపంచ వరల్డ్ కప్-2025 క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా మెుదలైంది. ఏడు సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్ లో మట్టి కరిపించిన ఇండియా జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు వరల్డ్ కప్పును సొంతం చేసుకోలేదు. తాజా మ్యాచ్ తో వరల్డ్ కప్ ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అనే అని ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో పెరిగిపోయింది. ఈ మ్యాచ్ కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ కోసం ఇక్కడ చూడండి..
'ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025' భారత క్రీడాకారిణిలు సొంతం చేసుకోవాలని యావత్ భారతదేశం కోరుకుంటోంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా మధ్య ఈ మధ్యాహ్నం జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలిచి..
టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే బీసీసీఐ వారికి భారీ బొనాంజా ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. భారత పురుషుల జట్టు 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి బీసీసీఐ రూ.125కోట్ల ప్రైజ్ మనీ అందించింది. ఒకవేళ హర్మన్ సేన విశ్వవిజేతగా నిలుస్తే అంతే మొత్తంలో నజరానా ప్రకటించాలని బోర్డు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా నవంబర్ 2న సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్లో ఆసీస్పై చూపించిన దూకుడు పునరావృతమైతే భారత్ తొలిసారి ట్రోఫీని ముద్దాడే అవకాశం ఉంది. లారా వాల్వార్ట్, కాప్ వంటి సఫారీ స్టార్లను నిలువరించడమే కీలకం.
పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో బాబర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఆ ప్లేస్ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మదే. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో బాబర్ 11 పరుగులు చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో మోస్ట్ రన్స్ చేసిన బ్యాటర్గా నిలిచాడు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్లో ఆసీస్పై టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. జెమీమా రోడ్రిగ్స్(127*) అద్భుతమైన నాక్తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ అయ్యాక జెమీమా డ్రెస్సింగ్ రూంలో చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.