ఇంటి దగ్గర సాధారణ కాన్పు చేయాలనుకున్న కుటుంబసభ్యుల ప్రయత్నం తీవ్రంగా బెడిసి కొట్టింది. కాన్పు సందర్భంగా తీవ్ర రక్తంస్రావం అయి ఓ గర్భిణి చనిపోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు.
ఆన్లైన్ కోర్టు విచారణల సందర్భంగా అప్రమత్తత ఎంత అవసరమో మరోసారి గుర్తు చేసే ఘటన వెలుగులోకి వచ్చింది. వర్చువల్ హియరింగ్ జరుగుతున్న సమయంలో మైక్ ఆన్లో ఉందన్న విషయాన్ని గమనించకుండా ఓ గుజరాతీ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు కోర్టు లైవ్ స్ట్రీమింగ్లో వినిపించడంతో వివాదానికి దారితీసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్నేహితుడు అంటూ ప్రపంచ వేదికలపై ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని తెలియజేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
2013లో ఓ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న స్వయంప్రకటిత ఆధ్యాత్మిక గురువు బాబా ఆశారం బాపునకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.27 కోట్ల విలువైన గోల్డ్ డీల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదంలో ఉన్న 8 కేజీల బంగారం విలువకు సమానమైన నగదును ఉన్నత న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని నిందితుడికి స్పష్టం చేసింది.
ఉత్తర్ప్రదేశ్ మధుర జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రక్కు, బస్సు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు.
కర్ణాటకలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక హెచ్చరిక చేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నాఫ్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్లైన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది.