అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఒడిశాలోని బలాంగిర్ జిల్లాలో కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. భార్య మొబైల్ ఫోన్తో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తమిళనాడులో గోవధను పూర్తిగా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు 'సవరణ' అవసరమని పేర్కొంటూ, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం పెద్ద ఊరటనిచ్చింది.
పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో 27 మంది వ్యక్తుల పౌరసత్వ స్థితిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
మహారాష్ట్రలో ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారనే ప్రచారం జరగడంతో పాల డెయిరీ నిర్వాహకులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో సతారా జిల్లాలో వందల లీటర్ల పాలను మురుగు కాలువల్లో పారబోసిన ఘటన కలకలం రేపింది.
తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మదురై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
జమ్మూకశ్మీర్లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం వచ్చింది. భూకంపం కారణంగా బారాముల్లా జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
పర్యావరణ పరిరక్షణలో గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. భారీ స్థాయిలో నిర్వహించిన వినూత్న ప్లాంటేషన్ డ్రైవ్ ద్వారా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమిర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశ రక్షణ రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అత్యాధునిక క్షిపణుల తయారీ, అభివృద్ధిలో ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. దీనిలో..