Home » National
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో 2023 అసెంబ్లీ సమావేశాలు పట్టుమని 20 రోజులు కూడా జరగలేదు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన పీఆర్ఎ్సఎల్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే మేధో సంస్థ నివేదిక వెల్లడించింది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కీలక ఆపరేషన్ నిర్వహించి దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థాన్ భారీ కుట్రను ఛేదించింది. గుజరాత్ తీరంలో 86 కిలోల డ్రగ్స్ను గుజరాత్ తీరప్రాంతంలో అధికారులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి కొద్దిమంది బిలియనీర్ల కోసం పనిచేస్తోందని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేస్తుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ-బీజేడీల మధ్య ''వైవాహిక బంధం'' ఉందని కూడా ఆయన ఆరోపించారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను నాలుగు రోజుల పోలీస్ రిమాండ్కు ముంబై కోర్టు ఆదివారంనాడు ఆదేశించింది. 'స్టయిల్', 'ఎక్స్యూజ్ మీ' వంటి పలు హిందీ చిత్రాల్లో సాహిల్ నటించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ యువరాజు (రాహుల్) దేశాన్నేలిన రాజులు, మహారాజులను అగౌరపరుస్తూ, నవాబులు, నిజాంలు, బాద్షాలపై అకృత్యాలపై మాత్రం నోరు మెదపరని విమర్శించారు.
మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చేదు అనుభవం ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో రేవణ్ణను సంబంధించినట్టు చెబుతున్న ఒక అశ్లీల వీడియో పోస్ట్ కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్లో భాగంగా ఈనెల 26న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఔటర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 6 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ కు భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏప్రిల్ 30న ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది.
ఈ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ 30 నుంచి 35 స్థానాలను కైవసం చేసుకుంటుందని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రతిష్ట కోసం భారమతి నుంచి పోరాటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం పుణేలో సంజయ్ రౌత్ విలేకర్లతో మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం 'ఆమ్ ఆద్మీ పార్టీ' రూపొందించిన పాటను భారత ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ఆప్ తప్పుపట్టింది. ఎన్నికల సంఘం ఆశ్రితపక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది.
రిజర్వేషన్లపై(Reservations) అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రోజు రోజుకీ మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఆర్ఎస్ఎస్(RSS) చీఫ్ ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు.