యుద్ధంలో ఇరాన్ను పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనికపరంగా, ఆర్థికంగానే కాక..
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు ముదురుతుంది. ఈ దేశాల మధ్య ఘర్షణ కారణంగా గల్ఫ్ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. తాజాగా దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది.
ఇజ్రాయెల్, అమెరికాలపై ఇరాన్ ఘాటు విమర్శలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్లు తమ షాహెద్-136 మోడల్ డ్రోన్లను రూపొందించి పలు దేశాలపై దాడులకు పాల్పడుతూ.. ఆ నిందను తమపై మోపుతున్నాయని ఇరాన్ మండిపడింది.
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ఇరాన్ తీరంపై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. జలసంధిని తెరిచి ఉంచేందుకు అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా యుద్ధ నౌకలను మోహరించే అవకాశముందని తెలిపారు.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి జరిపింది. శనివారం ఉదయం భారీ పేలుడు అనంతర అమెరికా ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్టు అధికారులు తెలిపారు.
ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు పగ్గాలు చేపట్టినా తమ తదుపరి టార్గెట్ అయనే అవుతారని ఇంతకుముందే ప్రకటించిన అమెరికా ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కానీ, ఆయనకు సంబంధించిన కీలక సమాచారం కానీ అందించిన వారికి భారీ రివార్డు ప్రకటించింది.
అమెరికాకు చెందిన కీలక విమాన వాహక యుద్ధ నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’పై దాడులు చేశామని ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్......
ముడి చమురు రవాణా నౌకలపై దాడి కోసం తమ వద్ద సూసైడ్ బోట్స్ ఉన్నాయని ఇరాన్ మిలిటరీ తాజాగా హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, గుర్తుపట్టలేనంతగా మారినట్టు తెలుస్తోందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు.
అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ఏరియల్ ట్యాంకర్ శుక్రవారంనాడు పశ్చిమ ఇరాక్లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి చెందినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.