పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ శాంతి చర్చల విషయంలో మాత్రం పూర్తి స్పష్టత రావడం లేదు. అమెరికా, ఇరాన్ల మధ్య ఒప్పందం విషయంలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇరాన్ కీలక రాజకీయ నాయకుల మధ్య ఎడం పెరిగినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. విదేశాంగ మంత్రిని తొలగించాల్సి రావచ్చని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన సన్నిహితుల వద్ద అన్నట్టు కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న చర్యల భవితవ్యంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. యుద్ధానికి సంబంధించి 1973 నాటి వార్ పవర్స్ తీర్మానంపై ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు భిన్నవాదనలను వినిపిస్తున్నాయి.
తమ భూభాగం మీదుగా ఇరాన్ ఎగుమతులకు పాక్ అనుమతించిందని అమెరికా భద్రతా వ్యవహారాల నిపుణుడు ఒకరు తెలిపారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన అంశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఈ ఇరువురూ దాదాపు 90 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు.
కోహినూర్ వజ్రం గురించి అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇవ్వాలని కోరుతానని తెలిపారు.
దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణను ముగించాలనే ఇరాన్ ప్రతిపాదనను అంగీకరించాలంటే తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకునే వరకు ఆ దేశంతో శాంతి ఒప్పందం కుదరదని ఆయన తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అమెరికా పాస్పోర్ట్లలో తన ఫోటోను ముద్రించాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. అయితే ఈ పాస్పోర్ట్లను పరిమిత సంఖ్యలోనే ముద్రించనున్నారు.
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ మౌలికవసతులపై దాడులు చేస్తే అంతకు నాలుగు రెట్ల నష్టం ప్రత్యర్థులకు జరుగుతుందని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాల్గొన్న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. 31 ఏళ్ల కోల్ టొమాస్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు ముందుగా ఒక నోట్ రాసి, తన కుటుంబానికి సందేశం పంపినట్లు అధికారులు వెల్లడించారు.