పనామా కాలువ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పసిఫిక్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న 'బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్' సమీపంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫ్యూయల్ ట్యాంకర్లో మొదలైన మంటలు ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీశాయి.
పశ్చిమాసియాలోని యుద్ధం నేపథ్యంలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్రంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతోంది.
ఎన్ని డెడ్లైన్లు విధించినా ఇరాన్ కాల్పుల విరమణకు ఒప్పుకోకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కాల్పుల విరమణకు ఇరాన్ నో చెప్పింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఓ కథనంలో తెలిపింది. శాశ్వత పరిష్కారం వైపే ఇరాన్ మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది.
మరికొన్ని గంటల్లో ఆర్టెమిస్-2 మిషన్ సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. భూమ్మీద నుంచి గరిష్ఠ దూరానికి చేరుకున్న మానవసహిత యాత్రగా రికార్డు నెలకొల్పనుంది.
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు చేసిన ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్లు పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, డెడ్లైన్ల ఒత్తిడిలో డీల్ సాధ్యం కాదని ఇరాన్ స్పష్టం చేసినట్టు సమాచారం.
హోర్ముజ్ జలసంధి మూసివేత తదనంతర పరిణామాలు, ఇరాన్ నుంచి వరుసగా ఎదురుదెబ్బల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రణ కోల్పోయారు. ఒప్పందానికి రావాలంటూ తాను పెట్టిన గడువు ముగుస్తున్నా ఇరాన్ స్పందించకపోవడంతో సహనం కోల్పోయి బూతులు లంకించుకున్నారు.
హోర్ముజ్ను తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిట్టిపోయడంపై ఇరాన్ తాజాగా స్పందించింది. ట్రంప్ టీనేజర్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఊహించిన దానికంటే ముందుగానే యూఎస్ రాతి యుగంలోకి వెళ్లిపోయిందని ఇరాన్ ఎంబసీ కామెంట్ చేసింది.
ఇరాన్కు ఇచ్చిన డెడ్లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టు పెట్టారు.
శత్రు భూభాగంలో తమ ఎయిర్మెన్ చిక్కుకుపోయినప్పుడు యూఎస్ సాహసోపేతమైన ఆపరేషన్ను నిర్వహించి అతన్ని రక్షించింది. దేశ చరిత్రలోనే తొలిసారి శత్రు భూభాగంలోకి వెళ్లి అత్యంత సాహసోపేతమైన ఈ ఈపరేషన్ను తమ సైన్యం సమర్ధవంతంగా నిర్వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.