ఇరాన్ చేసిన దాడిలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలు ఇరాన్ దాడిలో ధ్వంసమైనట్టు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇటీవల సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే.
దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి దుబాయ్ ప్రతీక. విమానయాన రంగానికి కీలక స్థానం. ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే నగరం.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో కీలకమైన హోర్ముజ్ జలమార్గం మూసివేయడం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్కు ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది.
పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలంటే తమ షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తోంది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసి ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ మిలటరీ కమాండ్ తాజా హెచ్చరికలు చేసింది. ఇంతవరకూ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుపుతున్న తమ దళాలు పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్కు సంబంధించిన ఆర్థిక, బ్యాంకింగ్ కేంద్రాలను టార్గెట్ చేయనున్నట్టు హెచ్చరించింది.
ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఖమేనీ వారసుడిగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.
అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు చేపట్టింది. హర్మూజ్ జలసంధి సమీపంలో 16 ఇరానియన్ మైన్లేయర్లను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సతమతమవుతున్న ఇరాన్ వాసులను మరోవైపు నల్లటి ఆమ్ల వర్షం ఆందోళనకు గురి చేస్తోంది. చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.
టెహ్రాన్లో ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది యుద్ధమా? ప్రళయమా? అంటూ జనాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి.