ఇరాన్ భూ భాగంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాకిస్థాన్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్తో పాకిస్థాన్ 900 కి.మీ.లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశంపై దాడులను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా తీవ్రంగా ఖండించారు.
ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులతో హడలెత్తిస్తున్న వేళ ఇరాన్ను భూకంపం కూడా వణికిస్తోంది. ఇరాన్లోని గెరాష్ ప్రాంతంలో కాసేపటి క్రితం 4.3 తీవ్రతతో భూకంపం సంభంచింది.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రపంచ వాణిజ్యంపై, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడం ఆసియా దేశాలను వణికిస్తోంది.
ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ ఓ గొప్ప పని చేశారు. సోమవారం సాయంత్రం దుబాయ్లోని షాపింగ్ మాల్కు వెళ్లారు.
అంతర్జాతీయ ముడి చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని, ఏ నౌక అయినా దాటడానికి ప్రయత్నిస్తే కాల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకదళం ఆ పని చేస్తాయని వార్నింగ్ ఇచ్చింది.
పశ్చిమాసియలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఆమెరికా వైమానిక స్థావరాలు, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై దాడులను ముమ్మరం చేసింది.
అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ గత శనివారంనాడు తొలిసారి టెహ్రాన్పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారంనాడు మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా నాటాంజ్లోని ఇరాన్ ప్రధాన అణుక్షేత్రంపై దాడి చేసినట్టు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్ రాయబారి రెజా నజాఫి తెలిపారు. అయితే దీనిని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ ఖండించింది.
ఇరాన్తో యుద్ధం మరో నాలుగు, ఐదు వారాలు జరగొచ్చని, ఆ యుద్ధం ముగిసేలోపు మరింత మంది ఎక్కువ అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా మద్దతుతో ఇరాన్పై ఇజ్రాయెల్ శనివారంనాడు దాడి జరపడం, ఇందుకు ప్రతిగా ఇరాన్ వరుసగా రెండోరోజు కూడా అమెరికా మిత్రదేశాలపై దాడులు జరుపుతుండటంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగుదేశాలపై దాడులు ఎందుకు చేస్తున్నారని ఇరాన్ను నిలదీసింది.