ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయంగా కాస్త ఉపశమనం నెలకొంది. పలు దేశాలు స్టాక్ మార్కెట్లు, బంగారం ధరలు, చమురు ధరలు కోలుకున్నాయి.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేయడంతో ప్రపంచ దేశాలు కాస్త ఉపశమనం పొందాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ వాల్స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఓ కథనం సంచలనంగా మారింది.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య శాంతిస్థాపన దిశగా తదుపరి దశ చర్చలకు ఇస్లామాబాద్ను వేదికగా ఎంచుకోవాలని పాక్ సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే ఒక్కో సరకు రవాణా నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18 కోట్లు) చొప్పున వసూలు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై ఇరాన్ స్పందించింది.
ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పలు ప్రాంతాలపై క్షిపణులతో దాడు చేసింది. యుద్ధం ముగించాలని కోరుతూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇరు పక్షాలకు సూచించారు.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచానికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల పతనానికి కారణమవుతోంది. అలాగే పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ నగరాలపై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్లోని డిమోనా, అరాద్ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం ఉంది.
హోర్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. అలాగే పొరుగు దేశాలపై దాడులను కూడా ఆపాలని కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లబడే సూచనలు కనిపించడం లేదు. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. తాజాగా ఇరాన్లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడినట్టు స్థానిక మీడియా సంస్థ తస్నిమ్ తెలిపింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత నతాంజ్ అణు క్షేత్రంపై దాడులు చేయడం ఇది రెండోసారి.