ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దాదాపు నలభై రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 3375 మంది మరణించినట్టు ఇరాన్ తెలిపింది.
కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా ఒక భారత నౌక హోర్ముజ్ను దాటింది. శుక్రవారం రాత్రి జలసంధిని దాటిన ఈ నౌక మరికొన్ని రోజుల్లో భారత్కు చేరుకుంటుంది.
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా, ఇరాన్లు బుధవారం రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించాయి. దీనిలో భాగంగా, ప్రపంచ ఇంధన సరఫరాలను పునరుద్ధరించేందుకు వీలుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం కీలక మలుపు తీసుకుంది. ఇరాన్పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు.
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రెండు వారాల గడువు ఇచ్చారు.
ఇరాన్లో భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ కీలక సూచన చేసింది. తమ నివాసాల్లోంచి కాలు బయటపెట్టవద్దని పేర్కొంది. మిలిటరీ స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.
తాత్కాలిక కాల్పుల విరమణకు బదులు శాశ్వతంగా యుద్ధానికి తెరదించే పరిష్కారం కావాలని అమెరికాకు ఇరాన్ తేల్చి చెప్పింది. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదనలను తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
గ్రీన్ ఆశా అనే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా హోర్ముజ్ను దాటింది. ఎల్పీజీతో ఉన్న ఈ నౌక భారత్ వైపు బయలుదేరినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
శాంతి చర్చల ప్రతిపాదన ముందుకు కదలకపోవడంతో పశ్చిమాసియా భీకర దాడులతో దద్దరిల్లుతోంది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్కు భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.