ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై యూట్యూబ్ యాజమాన్యం స్పందించింది. వివరాల్లోకి వెళితే..
ఒకవైపు ఇరాన్తో అణు చర్చలు జరుపుతూనే.. అమెరికా మధ్యప్రాచ్య ప్రాంతంలో తన సైనికశక్తిని విపరీతంగా పెంచుతోంది. గత 24 గంటల్లోనే 50కి పైగా ఫైటర్ జెట్లను ఈ ప్రాంతానికి తరలించినట్లు అధికారిక వర్గాలు, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ఆధారంగా తెలుస్తోంది.
శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో మంగళవారం ఆమోదించబడింది. అయితే, ఈ ప్రతిపాదనను కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. వివరాల్లోకి వెళితే..
బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన మహమ్మద్ యూనస్ చివరి ప్రసంగంలో కూడా భారత్పై అక్కసు వెళ్లగక్కారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీఎన్పీ నేత తారిఖ్ రెహ్మాన్ బంగ్లా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లేదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహమాన్ మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పార్లమెంట్ బిల్డింగ్ సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది.
అమెరికాకు వచ్చే విదేశీయులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు. అమెరికా వ్యతిరేక చర్యలకు దిగితే వారి వీసాలను వెనక్కు తీసుకుంటామని హెచ్చరించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటనకు గాను ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారంనాడు ఒక సదస్సులో విషయాన్ని వెల్లడించారు.
ఉత్తర కొరియాలో కుటుంబ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పరిస్థితి అత్త వర్సెస్ కోడలిగా మారింది. అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు కిమ్ జు యేను తన స్థానంలో దేశాధినేతను చేయాలని చూస్తున్నారట. మరోవైపు దేశాధినేత పదవి కోసం కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జంగ్ కూడా పావులు కదుపుతున్నారట..
అమెరికాలోని నెవాడాలో ఉన్న 'ఏరియా 51' ప్రాంతం గురించి రకరకాల పుకార్లు వినిపిస్తుంటాయి. నెవాడా ఎడారిలో దాదాపు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 'ఏరియా 51' ప్రాంతంలో గ్రహాంతర జీవులను అమెరికా నిర్బంధించిందని చాలా మంది నమ్ముతుంటారు.
ఆఫ్రికా దేశం సూడాన్లో పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) బలగాలు దారుణానికి పాల్పడ్డాయి. గతేడాది అక్టోబరు చివర్లో డార్ఫర్ ప్రాంతంలో ఈ బృందాలు జరిపిన క్రూరమైన హింసాకాండలో...