అంతరిక్షంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 4 టన్నుల బరువున్న 'స్పేస్ఎక్స్'కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ శకలం చంద్రుడిని ఢీకొన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో విదేశీ మీడియాపై పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది.
ఇరాన్తో నెలలుగా కొనసాగుతున్న యుద్ధం అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వర్చువల్గా పాల్గొననున్న కార్యక్రమంపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ కార్యక్రమం నిర్వహణలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఉక్రెయిన్లో ఓ సామాన్య పౌరుడిని వెంటాడి దాడి చేసిన డ్రోన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ వీడియోను షేర్ చేశారు.
గల్ఫ్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుబాయ్లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంతో పాటు పోర్టు సమీపంలో బుధవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబాతో జరిగినట్టు చెబుతున్న ఓ మీటింగ్ను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అవమానకరంగా భావించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన గోల్ఫ్ కోర్స్ వద్ద తుపాకీతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి జరిగింది. మంగళవారం యెమెన్ జలాల సమీపంలో జరిగిన ఈ దాడిలో ఎమ్ఎస్వీ ఫైజ్ నూరే ఓలియా షిప్ నీట మునిగింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విధించిన కొత్త సుంకాలు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. వెట్టి చాకిరీతో ముడిపడి ఉన్న వస్తువులు/సరుకుల దిగుమతిని తగ్గించే పేరుతో..