సాధారణంగా ఒక దేశ అత్యున్నత, సెన్సిటివ్ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులు అలాంటి ప్రాంతాలకు వెళ్లలేరు. వీఐపీలు కూడా అక్కడ కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రోటోకాల్స్ విషయంలో ప్రధాని లేదా దేశ అధ్యక్షులకు మినహాయింపులు ఉంటాయి.
ఈశాన్య కొలంబియాలో ఒక చిన్న సాటేనా విమానం కూలిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కుకుటా నుంచి ఒకానానుకు బయల్దేరిన కొద్ది నిముషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.
పాలస్తీనాలో హమా్సను అంతమొందించి, శాంతిని, అభివృద్ధిని నెలకొల్పే అమెరికా శాంతి ప్రణాళిక విజయవంతమవుతుందనే భరోసాను భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా డ్రోన్ల (యూఏవీ) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చైనాతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్కే లాభదాయకమని అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసర్ గ్రీర్ అన్నారు.
రానున్న కాలంలో దక్షిణాఫ్రికాకు వాహనాలను ఎగుమతి చేసే భారత ఆటోమొబైల్ కంపెనీలపై ప్రభావం పడే సంకేతాలు కనిపిస్తున్నాయి..
అజిత్పవార్ మృతిపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు అజిత్ పవార్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా'కు చెందిన ఓ రీసెర్చ్ విమానం మంటల్లో చిక్కుకుంది. ల్యాండింగ్ గేర్ లేకుండానే హ్యూస్టన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య ఇటీవల వాణిజ్యపరమైన ఉద్రిక్తత నడుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ హెచ్చరికలపై కార్నీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాటల్లో నిజం లేదని కెనడా ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఒకవైపు అమెరికా దాడి చేస్తుందనే భయాలు, మరోవైపు ఆర్థికపరమైన ఆంక్షలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిణామాలతో పాటు అంతర్గత సంక్షోభం కూడా చల్లారడం లేదు. దీంతో ఇరాన్ కరెన్స్ మరోసారి పతనమైంది. డాలర్తో పోల్చుకుంటే సరికొత్త కనిష్టానికి దిగజారింది.