స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలను భారీ కార్చిచ్చు చుట్టుముట్టింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో 2.5 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రష్యాపై ఉక్రెయిన్ మరోసారి దాడులు చేసింది. సమారా ప్రాంతంతో పాటు అజోవ్-బ్లాక్ సీ కెనాల్పై ఆదివారం దాడులు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరా గొలుసు సమస్యలు కొనసాగుతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే యూరప్లో కీలక ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాత్రం ఇంతటి సంక్షోభ సమయంలోనూ ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది.
ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ఐరోపా ఖండం అల్లాడుతోంది. జూన్ 21 నుంచి ఇప్పటివరకూ భానుడి ప్రతాపానికి 1300 మందికి పైగా కన్నుమూశారు.
జర్మనీలో తాజాగా కాల్పుల కలకలం రేగింది. స్డేడ్ నగరంలోని ఒక యూత్ కేంద్రంలో కాల్పులు జరగడంతో ఐదుగురు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఫ్రాన్స్లో వడగాలుల కారణంగా జూన్ 24 నుంచి ఆదివారం వరకూ 1000 మంది మరణించారని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రభుత్వ అంచనాలకు మించి ఈ అదనపు మరణాలు సంభవించాయని తెలిపారు.
ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఏకంగా 660 డ్రోన్లను ప్రయోగించింది.
ఏఐ సంస్థ ఆంథ్రోపిక్కు చెందిన అత్యాధునిక మోడల్స్ ఇతర దేశాలకు అందకుండా అమెరికా నిషేధించడంపై ఐరోపాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీ అంతరిక్ష పరిశోధన శాఖ మంత్రి డొరొతీ బార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు ఐరోపా, జర్మనీ అందించే సాంకేతికతలు కీలకమని గుర్తు చేశారు.
భారత్-ఈయూ దేశాల మధ్య ఎఫ్టీఏపై ఈ ఏడాది డిసెంబర్ నాటికి సంతకాలు పూర్తయ్యే అవకాశమున్నట్టు కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని కూడా ఆయన తెలిపారు.
ప్రధాని మోదీపై జాత్యహంకార పూరిత కార్టూన్తో ఒక వ్యాసాన్ని ప్రచురించిన నార్వే పత్రికపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.