స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లే. దాదాపుగా ఈ ఏడాది సెప్టెంబరు లోనే ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలు స్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్.కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. బజ్జీలు తిన్న అనంతరం 13 మంది ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
వైసీపీ హయాంలో తనపై నమోదైన కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఈ కేసుపై తాను పట్టువదలని విక్రమార్కుడిలా న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యానించారు.
ఇటీవల తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ బంగారంపై చేసిన ప్రకటన బులియన్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితికి దారితీసింది.
ఆక్వా రైతులపై ఒక్కసారిగా మేత భారం పడింది. ఒక పక్క రొయ్య ధర తగ్గిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే మరోవైపు మేత కంపెనీలు ఒక్కసారిగా ధర పెంచేశాయి.
గుబ్బల మంగమ్మ ఆలయ సమీపంలో తెలంగాణ అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన టోల్గేట్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొలగించారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు నిర్వహిస్తోన్న రెమిడియల్ క్లాసులను మంగళవారం కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు.
రాయలసీమను సీఎం చంద్రబాబు సస్యశ్యామలం చేశారని ఏపీ మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ ఫరూక్ వ్యాఖ్యానించారు. రాయలసీమకు నేడు చంద్రబాబు వల్లే సాగునీరు వస్తోందని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా కస్తూర్బా బాలికా విద్యాలయాల్లోని కాంట్రాక్టు సిబ్బంది, స్పెషలాఫీసర్లను సమగ్ర శిక్ష జిల్లా అధికారుల వేధిం పులపై ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు ఆఫీసర్ దృష్టి సారించింది.
రైతులకు బ్యాంకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ధాన్యం సొమ్ములు ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాయి.