అసలు నోట్లు లక్ష రూపాయలు తీసుకురండి... నకిలీ నోట్లు రూ. 3 లక్షలు ఇస్తాం. మీరు ఎంత తెచ్చినా దానికి తగ్గట్లుగా మా దగ్గర నకిలీ నోట్లు ఉన్నాయి. మీరు రూ. 10 లక్షలు తెస్తే రూ. 30 లక్షలు నకిలీ నోట్లు ఇస్తాం.. ఇలా అమాయకులకు వల వేసి సొమ్ము చేసుకుంటున్న ఒక ముఠాను భీమవరం వన్టౌన్ పోలీసులు వల వేసి చాకచక్యంగా పట్టుకున్నారు.
జిల్లాలో కాలువలు, చెరువులు, ఫీడర్ చానల్స్లో పూడికతీత, పునర్నిర్మాణం, ఆక్రమణల తొలగింపు తదితర పనులపై ఇంజనీరింగ్ అధికారులు ఈనెల 15లోగా ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.
మూల్యాంకన విధులకు నియమించిన టీచర్లలో కొందరు ముఖం చాటేయడం.. మార్కుల టోట లింగ్, స్కానింగ్, నమోదు కోసం ప్రవేశపెట్టిన ట్యాబ్లలో కొన్ని సరిగా పనిచేయకపోవడం.. అకస్మాత్తుగా పెనుగాలులతో కూడిన వర్ష బీభ త్సంతో స్పాట్ శిబిరం వెలుపల వేసిన టెంట్లు ఎగిరిపోవడం, వాహనాలు పక్కకు ఒరిగిపోవ డం.. తదితర స్వల్ప పరిణామాల మధ్య సోమ వారం స్థానిక సెయింట్ గ్జేవియర్ హైస్కూలు లో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాం కనం ప్రారంభమైంది.
జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీవర్షం బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన ఈదురుగాలులతో ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్స్థంభాలు, చెట్లు నేలకొరిగాయి.
వాతావరణం మార్పుతో రైతుల్లో భయం పట్టుకుంది. వరి చివరిలో వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఈ వర్షం దాళ్వా సాగుకు గండంగా మారింది.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన కొవ్వూరి గోపిచంద్రారెడ్డి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వేముల మోహనసాయి, బర్రె సుధీర్ అనే వ్యక్తులు మార్కెట్లో ఫేక్ కరెన్సీ సరఫరా చేస్తున్నారు. అయితే, రూ.లక్షకు రూ.3లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తామని భీమవరానికి చెందిన శివశంకర్ను ఈ ముఠా నమ్మించింది.
జిల్లాలో భూగర్భజల మట్టాలు పెంపు నకు సమగ్ర కార్యాచరణ దిశగా వివిధ ప్రభుత్వ శాఖలు అడుగులు వేయను న్నాయి.
ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన ‘రైల్వే షాక్’ వార్తకు కేంద్ర మంత్రి శ్రీని వాసవర్మ స్పందించారు.
జిల్లాలో రబీ సీజన్ (2025–26) లో పండించిన ధాన్యాన్ని సోమవారం నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 123 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం శిబిరం సోమ వారం నుంచి స్థానిక సెయింట్ గ్జేవియర్ స్కూలులో ప్రారంభం కానుంది.