భీమవరం– పాల కొల్లు రహదారిలో పూలపల్లి వైజంక్షన్ వద్ద ఆక్వా రైతుల శుక్రవారం తమ చెర్వుల్లోని రొయ్యలను తీసుకొచ్చి రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు మండు టెండలో మానవహారం నిర్వహించారు.
టిడ్కో గృహ లబ్ధిదారులకు ఊరట కలగనుంది. టిడ్కో గృహ లబ్ధిదారులు ప్రభుత్వానికి చెల్లిం చిన రూ.14 కోట్లు తిరిగి వారి ఖాతాలో కొద్ది రోజుల్లో జమ చేయనున్నారు.
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు నాలుగు నెలలు ప్రణాళికను ఎన్నికల కమిషన్ రూపొందించింది. ఇందులో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఫొటో ఎలక్ర్టోల్ రోల్స్(సర్)కు యంత్రాంగం సన్నద్ధం అవుతోంది.
ప్రచంఢ భానుడి ప్రతాపానికి జిల్లా ప్రజలు విలవిలలాడారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
పూర్వ పశ్చిమగోదావరి జిల్లాకు నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటూ దశాబ్దాలుగా కలలు కంటున్నారు.
జిల్లాలో బుధవారం సూరీడు నిప్పులు చెరిగాడు. వడగాడ్పుల తీవ్రతతో ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు భీతిల్లిపోయారు.
నేలలో తేమశాతం పెరుగుదలకు, చీడపీడల నుంచి పంటల సంరక్షణకు ‘సీడ్ పెలెటైజేషన్ బాల్స్’ ఉపయో గపడతాయని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేశ్ తెలిపారు.
అఖిల భారత కెమిస్టు సమాఖ్య పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా బుధవారం చేపట్టిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది.
వేసవిలో దాహం తీర్చేందుకు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎక్కువగా ఉపయోగించే కొబ్బరి బొండాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
‘మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ 240 రోడ్డు ప్రమాదాలు జరిగితే 113 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇదే సమయంలో 194 ప్రమాదాలు జరగ్గా 154 మంది చనిపోయారు. అతి వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయాలి’ అని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.