ద్వారకాతిరుమల దేవస్థానంలో నకిలీ టిక్కెట్ల వ్యవహారంలో ఇప్పటి వరకూ 9 మందిని అరెస్టు చేసినట్టు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ చెప్పారు.
ఇటీవల ప్రభుత్వం పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన వార్డులు పెంచింది. కానీ జిల్లాలో నర్సాపురం, ఆకివీడులోనే పెంపు ప్రక్రియ చేపడుతున్నారు. విలీన గ్రామాల సమస్యతో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు పురపాలక సంఘాల్లో వార్డుల పెంపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా పదవులు పొందుతామని ఆశతో ఉన్నవారికి ఇది నిరాశ కలిగిస్తోంది..
ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల స్కాం వ్యవహారంలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు రాజుతోపాటు మరో ఆరుగురు దేవస్థానం ఉద్యోగులను అరెస్ట్ చేశామని చెప్పారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడులను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఖండించారు. నిరసనలు తెలిపే విధానాలు వేరే ఉంటాయని.. దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.
తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏదైనా చట్ట ప్రకారం చేయడమే తప్ప ఎక్కడా ఉదాసీనతగా వ్యవహరించదని పేర్కొన్నారు
మాజీ ముఖ్యమంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి సంయమనం పాటించకుండా దూషణలు చేయడం సరికాదని వైఎస్ జగన్పై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమన్నారు.
అక్షరంపై అక్కసు వెల్లగక్కేందుకు వైసీపీ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బెడిసికొట్టాయి.
డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని, ఎరువులు, పురుగుమందుల వినియో గాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై ఆలోచన చేయాలని’ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మత్య్స పరిశ్రమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
ఏలూరు నగర వాసులకు ఈ వేసవిలో తాగునీటి సమస్య ఎదురు కాబోతుందా..? ఈ ప్రశ్నకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించకపోతే అవుననే చెప్పాల్సి వుంటుంది. ఎందుకంటే ఎస్ఎస్ ట్యాంకులో నీటి నిల్వలు తొమ్మిది అడుగులకు పడిపోయాయి.
వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. రాయితీతో వ్యవసాయ పరికరాలు అందిం చేందుకు జిల్లాకు రూ.2.37 కోట్లు మంజూరు చేసింది.