జిల్లాలోని స్థానిక అవసరాలు, ఉపాధి వనరులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. గత రెండేళ్ల నుంచి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు నిరు ద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిం చేందుకు వివిధ శిక్షణలను నిర్వహిస్తోంది. రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేర్వేరు కంపెనీల్లో వేతనాలను కల్పించే ఉద్యోగ ప్రాప్తి చేపడుతున్నారు.
దాదాపు 15 ఏళ్ల తర్వాత మండలంలో దెబ్బతిన్న రహదారుల పునఃనిర్మాణానికి ప్రభుత్వం రూ.ఐదు కోట్లు మంజూ రు చేయగా ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో మేడేపల్లి నుంచి రెడ్డిగూడెం క్రాస్రోడ్డు వరకు, రెడ్డిగూడెం క్రాస్రోడ్డు నుంచి రుద్రమ్మకోట వరకు, వేలేరుపాడు నుంచి రుద్రమ్మకోట వరకు, వేలేరుపాడు నుంచి కోయిదా వరకు రహదారుల పునఃనిర్మాణం పేరిట కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి పూర్తి చేయించారు.
జిల్లా వ్యాప్తంగా బుధవారం పగలు అత్యంత తీవ్రకరమైన వేడిగాలులతో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాత్రి ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురిసింది.
జిల్లా ప్రయాణికులుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చల్లటి వార్త అందించారు.
కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయడంతో 95 శాతం పూర్తయిందని సుప్రీంకోర్టు నుంచి త్వరలోనే అనుమతులు వస్తాయని ఎమ్మెల్యే డాక్టర్ కామి నేని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.
రెవెన్యూ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది..చిన్నపనికి కూడా పదేపదే తిరగాల్సి వస్తోందంటున్నారు. రీసర్వే పనులతో రెవెన్యూ సిబ్బంది, అధికా రులు తలమునకలై ఉంటున్నారు. గత ప్రభుత్వం రీసర్వే తప్పిదాలు వెంటాడు తున్నాయి.. సిఫారసులు ఉంటే గానీ పనులు అవడం లేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.
నరసాపురంలో వశిష్ఠ గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.
ఆది నుంచి ఉన్నది సనాతన ధర్మమేనని దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని చిలకలూరిపేట ఆదిపరాశక్తి క్షేత్ర పీఠాధిపతి నిత్య విద్యానంద భారతి స్వామీజీ అన్నారు.
మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో చేపట్టిన జలజీవన్ మిషన్ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి.
మావుళ్లమ్మ హుండీల సొమ్ములు 75 రోజులకుగాను లెక్కించగా అరవై ఒక లక్ష ఆరువేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్ తెలిపారు.