జిల్లా యంత్రాంగం ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడం, ముందస్తు జాగ్రత్తలతో మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కలుగలేదు. ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. జిల్లాలోని 27 మండలాల్లోని 664 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం చూపించింది.
గోశాల నుంచి గోపూజ కోసం సప్త గోకులం వద్దకు ఆవులను సిబ్బంది తీసుకెళ్లారు. సప్త గోకులాన్ని శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గడ్డిని ఆవులు మేస్తున్నాయి. ఈ సమయంలో ఆవులను త్రాచుపాములు కాటు వేశాయి.
తీర ప్రాంతంలో మంగళవారం రాత్రి ఎవరికీ కంటి మీద కునుకు లేదు. ఓ వైపు గాలులు.. మరోవైపు సముద్రపు హోరు.. ఇటు చూస్తే బోరున వర్షం.. కరెంటు లేదు.. ఏం జరుగుతుందో తెలియదు..
రైతులకు అండగా నిలుస్తామని రానున్న రెండు మాసాలలో డ్రెయిన్లు, కాలువలు, ఇతర ఆక్రమణలను తొలగించి నీటిపారుదల మెరుగుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటి స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు.
అనధికార లే–అవుట్లలో ప్లాట్ ఉన్నవారు , లే–అవుట్లను అభివృద్ది చేసిన యజమానులు , మునుపటి ఎల్ఆర్ఎస్ 2020లో దరఖాస్తు చేయని వారు ఎల్ఆర్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయాలి.
‘జిల్లాలో మొంథా తుఫాన్ నేపథ్యంలో 90 పునరావాస కేంద్రాలకు 3,422 మంది తరలించి సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలు వల్ల తుఫాన్ను సమర్థ వంతంగా ఎదుర్కొన్నాం. విపత్తు నివారణకు యంత్రాంగం మనస్సు పెట్టి చేసింది’ అని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మొంథా తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మంగళవారం రాత్రి జిల్లాలోని పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది.
మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాపై మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉంది. బలమైన ఈదురుగాలులతో జిల్లాలోని పలు మండలాలు వణికిపోయాయి.
మొంథా తుపానుని ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు.