రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల డిమాండ్స్ గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయాయని, ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడానికి ఏపీ ఎన్జీవో సంఘం బాధ్యత తీసుకున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అన్నారు.
వైసీపీ హయాంలో సహకార సంఘాల్లో ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీల్లోని కొందరు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు స్వాహా చేశారు.
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చాప కింద నీరులా జలు విప్పిన ర్యాగింగ్ భూతానికి వైద్యం చేసేదెవరు ? సీనియర్ల వికృత చేష్టలు భరించలేక జూనియర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడి.. చివరకు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడేందుకు కారకులు ఎవరు ?
జిల్లా కేంద్రమైన ఏలూరు స్టేడియాల్లోని రూపురేఖల్ని మూడు నెలల్లో మా ర్చి.. సుందరంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోండి.. వాకర్స్కు ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి’ అని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు క్రీడాధికారులను ఆదేశిం చారు.
ఏలూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మంగళవారం నిస్సారంగా సాగింది. కౌన్సిల్కు హాజరైన 36 మంది సభ్యులు నిశ్శబ్ధంగా కూర్చున్నారు. సూప రింటెండెంట్ సిరాజుద్దీన్ అజెండాలోని 18 అంశాలను ఒక్కొక్కటి చదువుతుంటే అందరూ తలలు ఊపారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ నెల 5న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
జిల్లాలో నాన్ లేఅవుట్ వేసిన రియల్టర్లు, కొనుగోలు చేసిన వారికి షాక్ తగిలింది. స్థలాలకు పన్ను చెల్లించే అసెస్మెంట్ నెంబర్లు లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులను తిప్పి పంపుతున్నారు.
దిత్వా తుఫాన్ ప్రభావం లేకున్నా మంగళవారం ముసురు, వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. మంగళవారం ఎడతెరిపి లేని వర్షంతో చేలల్లో నీరు చేరడంతో నాలుగు రోజుల పాటు మాసూళ్లు చేసే అవకాశం లేకుండాపోయింది.
పత్తి రైతాంగాన్ని కష్టాలు చుట్టు ముట్టాయి. ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు కూలీల కొరత, గిట్టు బాటు ధర లేకపోవడంతో మూడేళ్లుగా రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో సోమవారం నిర్వహించిన పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది.