మార్కెట్లో పచ్చడి మామిడి కాయలు ముచ్చెత్తాయి. గత వారంతో పోల్చుకుంటే అధిక సంఖ్యలో మామిడి కాయలు వచ్చాయి. కొత్తపల్లి మామిడి అత్యధిక ధర పలికింది. నాణ్యత ఆధారంగా ఈ ధరలను వ్యాపారులు నిర్ణయించారు.
ఒకప్పుడు తీర ప్రాంతంలో పండే ఉప్పు పంటకు ఎంతో డిమాండ్ ఉండేది. పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఈసాగు చేసేందుకు రైతులు మక్కువ చూపేవారు.
ముగ్ధమనోహర రూపలావణ్యాలను ఒలికిస్తున్న అలివేలుమంగ, ఆండాళ్ అమ్మవార్లు నడుమ కొలువుతీరిన చిన్నతిరుమలేశుడు పెండ్లి కుమారునిగా ముస్తాబయ్యారు.
జిల్లాలో పెట్రోలు, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని జేసీ ఎంజె అభిషేకగౌడ స్పష్టం చేశారు.
జనగణనలో భాగంగా స్వయంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం సులభతరమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు.
భీమవరం ప్రాంతంలో ఓ బంకు యజమాని డీజిల్ కోసం రూ. 50 లక్షలు చెల్లించారు. కంపెనీ నుంచి సరఫరా రాలేదు. వారి వద్ద ఎప్పటినుంచో డీజిల్ కొనుగోలు చేస్తున్న ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు.. మూతపడిన బంకులు.. కొద్దిపాటి నిల్వలు ఉన్న చోట వాహనాల రద్దీ, డీజిల్ కోసం క్యూలో ఉంచిన డబ్బాలు..!
పాలి టెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం ఏలూరు, నూజి వీడు, జంగారెడ్డిగూడెంలలో మొత్తం 15 కేంద్రాల్లో నిర్వ హించిన ఏపీ పాలిసెట్–2026 ప్రశాంతంగా ముగిసింది.
సమగ్రశిక్ష జిల్లా కార్యాలయంలోని ఓ అధికారి కి, విలీన మండలాల్లోని పాఠశాలలను పర్య వేక్షించే ఓ డివిజన్ ఉప విద్యా శాఖాధికారికి మధ్య కొద్దిరోజులుగా విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
‘గతంలో కూలీలను పెట్టి వరి కోతలు కోయించే వాళ్లం. ఇప్పుడు పూర్తిగా యంత్రాలపై ఆధారపడ్డాం. ఆక్వా చెరువులకు ఆక్సిజన్ కొరత పట్టి పీడిస్తోంది. వీటి నివారణకు డీజిల్ లభించక ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ జిల్లావ్యాప్తంగా రైతులు వాపోతున్నారు.