రైతులకు మంచి ఆదాయం వచ్చేలా ఉద్యాన పంటలకు ప్రోత్సా హం అందిస్తున్నామని వ్యవసాయ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోని నూజివీడు నియోజక వర్గానికి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేశారు. అయితే నూజివీడు నియోజకవర్గం బయట నుంచి వచ్చిన వలస కాంట్రాక్టర్లు నూజివీడు పట్టణంలోని పలు పనులను దక్కించు కోగా అధికారుల పర్యవేక్షణ లోపంతో నాసిరకపు పనుల నేపథ్యం లో చేసిన పనులను తిరిగి చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
భూముల క్రయ, విక్రయాలకు సంబంధిం చి రిజిస్ర్టేషన్లు గురు, శుక్రవారాల్లో ఊపందు కున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి భూములు మార్కెట్ విలువలు పెరగనున్న నేపథ్యంలో కక్షిదారులు ముందు చూపుతో వ్యవహరిం చారు.
పప్పు అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి ఓ చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని మార్కండేయపురం జగనన్న లేఅవుట్ కాలనీ ఎల్–3లో చోటు చేసుకుంది.
ఏలూరులోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) సూపర్ బజార్ మూతవేయడంపై పలు గుసగుసలు శుక్రవారం హల్చల్ చేశాయి. నెలాఖరు రోజుల్లో చాలామందికి జీతాలు పడు తుంటాయి.
జిల్లాలో మెట్ట ప్రాంతాలైన చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల్లో అపార బొగ్గు నిల్వలు ఉన్నట్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. వీటిని వెలికితీస్తే ఈ ప్రాంతాల దశ మారనుంది. చింతలపూడి మండలం రేచర్ల బ్లాక్లో బొగ్గు వెలికితీతకు టెండర్లు పిలిచినా వేలం వాయిదా పడింది.
పడమరవీధిలో జరుగుతున్న గంగానమ్మ జాతర కార్యక్రమాల్లో భాగంగా మేడల్లో కొలువై ఉన్న అమ్మవార్లను శుక్రవారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ కె.ప్రతాప శివకిషోర్లు దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి భక్తుల మనోభా వాలు దెబ్బతీసిన మాజీ సీఎం వైఎస్.జగన్ స్వామికి క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎమ్మెల్యే బడేటి చంటి డిమాండ్ చేశారు.
కరువు పీడిత గ్రామాల్లో 50 వేల ఎకరాలను గోదావరి జలాలలో సస్య శ్యామలం చేయడమే కాక 70 గ్రామాలకు తాగునీటి ఇబ్బం దులు తీర్చడానికి ఉద్దేశించిన పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పఽథకానికి మోక్షం ఉందా? లేదా? అని ఆయకట్టు రైతులు ఆశ–నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
జిల్లాలో సాగునీటి చెరువుల అభివృద్ధి ప్రతి పాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిన్ననీటి పారుదల, కీలక మేజర్, మైనర్ చెరువుల్లో కనీసం తట్టెడు మట్టి తీసింది లేదు. కూటమి ప్రభుత్వం హయాంలో ట్రిపుల్ ఆర్ (రిపేర్లు, రిసోస్టరేషన్, రీ కనస్ట్రక్షన్) పథకం కింద తొలి విడతగా రూ.260 కోట్ల వ్యయంతో ప్రతి పాదనలు పంపగా, ఇప్పటివరకు కేంద్రం నుంచి ఆమోద ముద్ర పడలేదు.