పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్ద పేట రామాలయం అంశంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పందించారు. దళిత వర్గాలకు చెందిన వారిని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా వ్యవహరించినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.
జిల్లాలో ఫ్రీహోల్డ్ చేసిన భూములకు త్వరలో మోక్షం కలుగనుంది. జిల్లాలో 2703.53 ఎకరాలు ఈ విధంగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
చాట్రాయి మండలంలోని పోలవరం సెంటర్లో గల గాంధీజీ విగ్రహాన్ని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం కాళ్లు పెచ్చులూడి ఊచలు బయటకు వచ్చాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ విలువ, ఇంటి స్థలం విలువ పెంపుపై రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగావున్న వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ (బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ ఎంఎస్) కోర్సులు, బీఎస్సీ(నర్సింగ్)లో ప్రవేశాలకు ఈ నెల 3న నిర్వహించనున్న నీట్ యూజీ–2026 పరీక్షలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో ఏర్పా ట్లు పూర్తయ్యాయి.
నిన్న మొన్నటి వరకు గృహ విని యోగదారులకు అందించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎదురైన ఇబ్బందులు కాస్తా తీరాయనుకుంటే వాణిజ్య గ్యాస్ వినియోగదారులపై (కమర్షియల్ గ్యాస్) పెనుభారం పడిం ది.
రాష్ట్రంలోని 88 లక్షల మంది అసంఘటిత కార్మికుల శ్రేయస్సు కోసం ఏడాదికి రూ.615 కోట్లు వెచ్చిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జి అన్నారు.
పెన్షన్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్న నియోజకవర్గంలో 40 మంది వికలాంగులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధులు రూ.1.20 లక్షలు అందజేసి దాతృత్వం ప్రదర్శించారు.
చిన వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవం భక్తజనులకు ఆద్యంతం కన్నుల పండువైంది. రాత్రి ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీస్వామివారిని తొళక్కం వాహనంపై ఉంచి అలంకరించారు.
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు 81.72 శాతం ఉత్తీర్ణతతో గతేడాది మాదిరి గానే రాష్ట్రంలో 21వ స్థానం లభించింది. గతేడాది ఫలితాల (77.23 శాతం)తో పోల్చితే 4.5 శాతం అదనంగా ఉత్తీర్ణత వచ్చిందన్న ఒకింత ఊరట తప్పితే చెప్పుకోదగ్గ విషయమేదీ లేదు.