మొంథా తుఫాన్ నష్టాలపై అంచనాకు వచ్చిన కేంద్రబృందం పరిశీలన కార్యక్రమం అరగంటలోనే ముగించేశారు. ఉంగుటూరు మండలంలో నారాయణపురం, ఉంగు టూరు గ్రామాల్లో పర్యటించాల్సినప్పటికి నారాణయపురంతోనే సరి పెట్టేశారు.
వరి కోతలకు వెళుతుండగా విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
జంగా రెడ్డిగూడెం పట్టణానికి ఎర్రకాలువ జలాశయం నుంచి శుద్ధి చేసిన మంచినీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా అందించడానికి మార్గం సుగమం అయ్యింది.
జిల్లాను నిధుల కొరత వేధిస్తోంది. పలు అభివృద్ధి పనులు నిలిచి పోయే పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో మొంథా తుఫాన్ తీవ్రంగా పంట నష్టాలను మిగిల్చిం ది. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం ఈనెల 10వ తేదీ సోమవారం జిల్లాలో పర్యటించ నుంది.
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులను ఎలుక కరిచింది. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ సీరియస్ అయ్యారు.
ధాన్యం అమ్మిన గంటల వ్యవధిలో ఖాతాల్లో సొమ్ములు జమవుతుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో నెలల తరబడి ధాన్యం సొమ్ముల కోసం ఎదురుచూసే పరిస్థితి వుండేది.
మెప్మా దృష్టి పెట్టింది. స్వయం సహాయక సంఘాల సభ్యుల పిల్లలతోపాటు మిగిలిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
గోదావరి తీర ప్రాంత ఇసుకకు ఆంధ్రాతోపాటు తెలంగాణలోను డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు ఇసుకాసురులకు ఇసుక అక్రమ రవాణా కాసుల వర్షం కురిపిస్తోంది.
ఇంటిపన్నుల వసూళ్లలో పార దర్శకంగా వ్యవహరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా స్వర్ణపంచాయతీ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం పంచాయ తీల పరిధిలోని పంచాయతీ పన్నులకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని పంచా యతీరాజ్ ఉన్నతాధికారులు గుర్తించారు.