వెట్మిక్స్ వేసి నెల అవుతున్నా నేటి వరకు నీటితో తడపలేదు. పవర్ రోలర్తో పోసి న వెట్మిక్స్ను తొక్కించాల్సి ఉన్న ఆ పని చేయ లేదు. దీంతో రోడ్లపై పోసిన వెట్మిక్స్ మెటల్ లేచిపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ఆలయాల్లో బుధవారం హుండీల సొమ్ము లెక్కించారు. భీమవరం మావుళ్లమ్మ ఆలయ హుండీలను బుధవారం లెక్కించ గా 26 రోజులకుగాను 25లక్షల 63వేల 619 రూపాయిలు ఆదాయం వచ్చిందని దేవస్ధానం సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మినగేష్ తెలిపారు.
పట్టణాల్లో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. బయో డంపింగ్ యార్డులు ఏర్పాటు కానున్నాయి.
పురపాలక సంఘాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యం నెరవేరడం లేదు. మునిసి పల్ కమిషనర్లు పారిశుధ్యం పనుల పర్యవేక్షణ చేయడం లేదు. ఏలూరు కార్పొరేషన్లో ఏ వీధి చూసిన చెత్త, మట్టి దిబ్బల గుట్టలు రోజుల తరబడి పేరుకుపోతున్నా యి.
తీరంలో మళ్లీ ఇసుక తవ్వకాలు యఽథేచ్ఛగా సాగుతున్నాయి. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సముద్ర తీరం వెంబడి ఇసుక తవ్వి సరిహద్దులు దాటిస్తున్నారు.
ఆగిరిపల్లి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. మంత్రి కె.పార్థసారథి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ మట్టి మాఫియా ఆగడాలకు అంతు లేకుండా పో యింది.
హమాలీ చార్జీల కోసం మూడున్నర నెలలుగా ఎదురుచూస్తున్న రైతులకు ఎట్టకేలకు సొమ్ములు వచ్చాయి.
జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు బాగుంది.. ఇది చాలదు.. ఇంకా బలం మరింత పెరగాలి..
జిల్లా కేంద్రమైన ఏలూరు కొత్త బస్టాండ్ 50 ఏళ్ల క్రితం నిర్మించారు. భవనం శ్లాబ్ పెచ్చులూడుతోంది.
పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర జల్ శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు, ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్ వోహ్రా, సీడబ్ల్యూసీ సభ్యులు యోగేష్ పైథంకర్ బుధవారం రానున్నారు.