వచ్చేనెల 15 నుంచి పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు చర్యలు చేపడుతున్నామని తహసీల్దారు మలపురెడ్డి శ్రీను అన్నారు.
పరిశుభ్రమైన బొబ్బిలి-ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం అని మున్సి పల్ చైర్మన్ రాంబార్కి శరత్బాబు పిలుపు నిచ్చారు.
If you borrow to repay the debt.. ప్రతి ఏటా అప్పుల వ్యవసాయమే. అయినా సాగు విడిచిపెట్టని రైతు అతను. చేసిన అప్పలు తీర్చడానికి తన భార్య నగలు బ్యాంకులో తాకట్టు పెట్టాడు. నగదు తీసుకుని ఇంటికి వస్తుండగా దొంగలు ఎత్తుకెళ్లారు.
gurla gedda mini resurveror గుర్ల గెడ్డ రిజర్వాయర్కు మంచిరోజులు రానున్నాయి. మంత్రి సంధ్యారాణి చొరవతో ఈ జలాశయం ఆయకట్టు రైతుల దశాబ్దాల ఎదురుచూపులు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రిజర్వాయర్ పూర్తికి రూ.17 కోట్లు అవసరమని ఇరిగేషన్ అధికారులు గత ఏడాది ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు మంగళవారం ఈ ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించారు.
Organ donation బొడ్డవర గ్రామానికి చెందిన మాసాడ కొండబాబు అలియాస్ భాను(33) తాను చనిపోతూ ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు.
Read it there ఒక పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీ (రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్- ఆర్జీయూకేటీ)కి సహజంగా ఇద్దరో.. ముగ్గురో.. నలుగురో ఎంపికవుతుంటారు. అంతకు మించితే అరుదుగా చెప్పుకుంటారు. కానీ కొత్తవలస జ్యోతిబా బీసీ గురుకులం నుంచి గత ఏడాది ఏకంగా 13 మంది విద్యార్థినులు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు.
Have Mercy, Polamamba ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ నాలుగో వారం జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం చదురు, వనం గుడుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.
Will the Eligible Be Supported? జిల్లాలో ఎంతోమంది అర్హులైన దివ్యాంగులు రూ.15వేల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
Will the Works Be Completed… or Just Empty Promises? ఇంటింటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో జిల్లాలో చేపట్టిన జల్ జీవన్మిషన్ (జేజేఎం) పనులు పూర్తిగా పడకేశాయి. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం.
Let’s Eliminate Intestinal Worms చిన్నారుల ఆరోగ్య సమస్యలకు కారణమైన నులిపురుగులను నిర్మూలిద్దామని జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పెదబొండపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. దీనికి మఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. అనంతరం వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేశారు.