ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన మరోసారి వాయిదా పడింది. గతనెలలో బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి ఆయన రావాల్సి ఉన్నా.. అభివృద్ధి పనులు పూర్తికాని నేపథ్యంలో పర్యటనకు బ్రేక్ పడింది.
అరకు పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సూచించారు. శుక్రవారం విజయ వాడలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తదితరులతో ఆయన సమీక్షించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.
గిరిజన ప్రాంతాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, విద్యా ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆర్.వైశాలి స్పష్టం చేశారు. సాలూరు మండలం తోణాం పంచాయతీ పరిధి దిగువ మెండంగి గిరిజన గ్రామంలో శుక్రవారం పర్యటించారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తోందని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. శుక్రవారం శివ్వన్నపేటలో రైతులకు రాజముద్రతో ఉన్న నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఇకపై వారంలో రెండుసార్లు డ్రైడే పాటించాలని డీఎంహెచ్వో భాస్కరరావు ఆదేశించారు. శుక్రవారం డోకిశీల పీహెచ్సీ పరిధిలోని మారుమూల గ్రామం డెప్పివలసను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని , డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
ఆరోగ్యం, పోషణ కార్యక్రమంలో సాధించిన ప్రగతికి గాను దేశంలోనే జిల్లాకు ప్రథమ స్థానం లభించిందని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మూడు నెలలకొకసారి నీతి అయోగ్ ప్రకటించే డెల్టా ర్యాంకింగ్లో ఈ సారి జిల్లాకు మొదటి స్థానం దక్కిందని పేర్కొన్నారు.
‘జిందాల్ యాజమాన్యం మొదటిగా పెడుతున్న ఇండస్ట్రీయల్ పార్కు ఇది.
బ్యాంకులు అంటే ప్రజలకు భద్రత, నమ్మకానికి ప్రతీక. అయితే, ఇటీవల కాలంలో కొన్ని బ్యాంకులు ఇన్సూరెన్స్ పాలసీల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుని ఖాతాదారులపై ఒత్తిడి తెస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రైతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
బొబ్బిలి మునిసిపాలిటీ పరిధిలోని హుగ్లీ జూట్మిల్లు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.