శిథిలావస్థలో ఉన్న కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాల కూల్చి వేతకు అనుమతిఇవ్వడంతోపాటు నూతన భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరుచేయాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కోరారు.
Everything is online. ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పాఠశాల విద్యాశాఖ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. అధికారులు, సిబ్బంది కేటాయింపులో మాన్యువల్ విధానానికి స్వస్తి పలికింది. కేంద్రాల చీఫ్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, అదనపు డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకాలన్నీ డిజిటల్ విధానంలో ఆటోమేషన్ పద్ధతిలో అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
Dig up the pond soil and add a berm! గరుగుబిల్లి నుంచి బీవీ పురం వరకు చేపడుతున్న బీటీ రహదారి నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదు. పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి. సాగునీటి చెరువుకు నష్టం కలిగించేలా రోడ్డు నిర్మాణం చేపడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంఽధిత అధికారులకు వారు ఫిర్యాదు చేశారు.
We Are First in Teaching విద్యా బోధనలో జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. పాఠశాల పిల్లలకు పాఠాలు బోధించడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మధ్యాహ్నం భోజనం రుచిలోనూ ఒకటో స్థానం దక్కించుకుంది. ఇటీవల మంత్రులు, హెచ్వోడీలతో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమవేశంలో ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ మేరకు మధ్యాహ్న భోజనం నాణ్యతలో మన్యం మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు.
Inter Examinations to Be Conducted in a Strict and Foolproof Manner జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23నుంచి జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
మండలంలోని చిన్నశిర్లాం పంచాయతీ కార్యదర్శి వి.బిందుశేఖర్ను ఇదే గ్రామ టీడీపీ నేత, తెలుగు యువత మండల అధ్యక్షు డు మజ్జి శ్రీనివాసరావు అసభ్య పదజాలంతో దుషించ టంపై మండల పంచాయతీ కార్యదర్శుల అసోసియేష న్ తీవ్రంగా ఖండించింది.
సాగునీటి కాలువలు పూడ్చేసి, లేఅవుట్లు వేయడం ఏమిటని భోగాపురం, నందిగాం గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు హోటల్ రహదారి కోసం తమ భూము లను వదులుకునేది లేదని దిబ్బలపాలెం గ్రామా నికి చెందిన రైతులు తెగించిచెప్పారు.
ఆర్టీసీ బస్సు, మినీవ్యానును ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.