Forest Region Leads in Resurvey Drive ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రీసర్వేలో పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని సీసీఎల్ఏ జి.జయలక్ష్మి తెలిపారు. భూ రికార్డులు, పట్టాదారు పాస్పుస్తకాలు, ఖాతాల సవరణ పురోగతిపై మంగళవారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసీలతో సమీక్షించారు.
విజయనగరం నగర రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. నగరంలోని 4వ డివిజన్కు చెందిన సుమారు 200 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కుటుంబాలు అధికారికంగా టీడీపీ గూటికి చేరాయి.
Price Shock” పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రభావం పరోక్షంగా జిల్లాలో నిర్మాణరంగంపై పడుతోంది. నిర్మాణ సామగ్రి ధరలన్నీ అమాంతం పెరిగి పోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Development of Tribal Areas is the Goal జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా నిర్వహిస్తున్న జనజాగృతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రత్యేక ప్రచార వాహనాన్నిజెండా ఊపి ప్రారంభించారు.
Why Was It Stopped Here? జిల్లాలో రేషన్ డిపో డీలర్ల నియామకం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఇతర జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. మన్యం జిల్లాలో మాత్రం నిలిచిపోయింది. అసలు ఈ ప్రక్రియ ఇక్కడెందుకు ఆపారన్న దానిపై స్పష్టత కొరవడింది
Irrigation Water Through Pipeline జలశక్తి పఽథకం ద్వారా పైప్లైన్ ద్వారా నేరుగా పంటలకు సాగునీరు అందిస్తామని జాయింట్ కమిషనర్ అంబ్లి తెలిపారు. పెద్దగెడ్డ ఆధునికీ కరణ పనులపై సోమవారం సాలూరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
very hot జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చాలా మండలాల్లో సోమవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 11 గంటల నుంచి 4 వరకూ వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
'Wrong' steps రాజాంకు చెందిన ఓ బాలుడు చెడు మార్గంలో వెళ్లొద్దని చెప్పిన తల్లిని ఏకంగా హతమార్చాడు. కుమారుడు పక్కదారి పడుతుండడాన్ని గమనించిన ఆమె మార్పు కోసం పరితపించింది. తప్పు నాన్న అని సుతిమెత్తగా మందలించింది. ఆ మాట గిట్టని కొడుకు మరో బాలుడితో కలిసి తల్లిని దారుణంగా హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో పరారయ్యాడు.
population wanted ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు నినాదం గతం.. ముగ్గురే కాదు నలుగురైనా పర్వాలేదు అనేది నేటి లక్ష్యం. మెరుగైన భవిష్యత్కు జనాభా అవసరమని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలు కనాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడమే కాదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. సరికొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా వేదికలపై పిలుపునిస్తున్నారు. అసెంబ్లీలో సైతం ఈ విషయంపై మాట్లాడారు.