పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారని గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఓ విద్యార్థి పాల్పడిన ఘటన మంగళవారం చినతోలుమండగూడలో చోటు చేసుకుంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్ర యంలో స్థానిక టాక్సీ డ్రైవర్లు, వాహన యజమానులకు టాక్సీ సర్వీసులు నిర్వ హించుకొనే అవకావం కల్పించాలని స్థానిక టాక్సీ డ్రైవర్లు కోరారు.
: రాజాంలో తూనికలు, కొలతలశాఖ అధికారులు మంగవారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు చికెన్, మటన్, చేపలు, పండ్ల దుకాణాల్లో కాటాలను తనిఖీ చేసి తూకంలో తేడాలున్నట్లు గుర్తించారు.
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులతో పాటు, బలహీనులకు ఉచిత న్యాయం అందించేందుకు న్యాయసేవాసంస్థలు పనిచేస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ న్యాయాధికారి కె.హరిబాబు పేర్కొన్నారు.
ల్నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి వీటీ రామారావు పేర్కొన్నారు.
వార్డులు వారీగా తయారు చేసిన ఓటర్ల జాబి తాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సరిచే యాల్సిన బాధ్యత ప్రణాళికా విభాగం సిబ్బం దిపై ఉందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి కోరారు.
Two more industries for the district
It’s the same in August too! ఖరీఫ్ సీజన్ ఏ మాత్రమూ ఆశాజనకంగా లేదు. ఎల్నినో ప్రభావం రైతాంగాన్ని తీవ్ర ఆందోళకు గురి చేస్తోంది. తిండి గింజలను సైతం ఇంటికి తీసుకెళ్లగలమో? లేదో ? అన్న కలవరంతో ఉన్నారు. ఆగస్టు ద్వితీయ పక్షంలోకి అడుగుపెట్టేసరికి మూడు వంతుల నేలలో వరినాట్లు పడేవి. ఇప్పుడలా లేదు. ఏ రైతును కదిలించినా నిట్టూర్పే వినిపిస్తోంది.
Wonderful, wonderful! భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు ఎయిర్పోర్టు బహుబాగుందని కితాబిస్తున్నారు. వందకు వందశాతం సూపర్ అంటున్నారు. పర్యాటక ప్రాంతంలా ఉందని చెబుతున్నారు. తెలుగు సంస్కృతిని చాటే చిత్రాలు, ఏటికొప్పాక బొమ్మలు, పచ్చని ప్రకృతి, సముద్రతీరం వీక్షించి ముగ్ధులవుతున్నారు.
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు.