Roads Pave the Way for Rural Progress వీబీజీ రామ్జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవిక మిషన్ ) పథకంలో గ్రావెల్ రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా గతంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరై మధ్య నిలిచిపోయిన రహదారుల పనులకూ మోక్షం కల్పించనుంది.
రామచంద్రపేట గ్రామానికి చెందిన రాలి గురమ్మ అనే మహిళ పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డా డు.
ఓ విలేకరిపై కర్రతో దాడి చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.
Father’s Heart Stops After Losing His Son తన తర్వాత ఇంటికి పెద్దదిక్కుగా ఉంటాడనుకున్న పెద్ద కొడుకు మరణ వార్తను ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. ఆరోగ్యం కుదటపడేవరకూ స్వగ్రామంలోని కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలనుకున్న కుమారుడు విగతజీవిగా పడి ఉండడం చూసి క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
Parking is a hassle. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెడితే చాలు బాదుడే బాదుడు. ఇంత వరకు విమానాశ్రయం ప్రారంభోత్సవం కోసం తహతహలాడిన ప్రజలు, ప్రయాణికులు, ఎయిర్పోర్టు శ్రామికులు ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎయిర్పోర్టులోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ద్విచక్రవాహనమో, కారో ఉండాలి.
Is This How Shirivara Road Works Are Being Done? గిరిశిఖర గ్రామం చెలకమెండంగి-శిరివర బీటీ రోడ్డు నిర్మాణాన్ని పునఃప్రారంభించకపోవడంపై ఐటీడీఏ పీవో ఆర్.వైశాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. రూ.2.40 కోట్ల వరకు బిల్లులు పొందినా రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
Youth Crushed by Marijuana Addiction గంజాయి మత్తులో నేటి యువత చిత్తవు తున్నారని, విద్యావంతులైన ఎంతోమంది సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతు న్నారని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. వారి కుటుంబాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి స్తోందన్నారు. బుధవారం కొత్తవలస పెద్దవీధిలో ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Kharif in danger జిల్లాలో ఖరీఫ్ ప్రమాదంలో పడింది. వరుణుడి జాడ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రిజర్వాయర్లు, కాలువలు, చెరువుల్లో ఉన్న నీరు కూడా ఆవిరైంది. మండుతున్న ఎండలు, పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉబాలు పూర్తిచేసిన పొలాల్లో సైతం నీరు లేకుండాపోతోంది.
Zilla Parishad Division! జిల్లా పరిషత్ విభజనపై స్పష్టత వచ్చింది. 2022లో జిల్లాల విభజన జరిగినా జడ్పీ మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జడ్పీ విభజనపై ప్రభుత్వం దృష్టిసారించింది. కొత్త జిల్లాల ప్రాతిపాదికనే జడ్పీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంది.
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ కూలిన ఘటనలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్తేజ అంతిమ సంస్కారాలు పట్టణంలోని ఆర్సీఎం చర్చి ఆవరణలో మంగళవారం నిర్వహించారు.