ఉపాధ్యాయ వృత్తి అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎలాగైనా ఉపాధ్యాయ కొలువు సాధించాలనే లక్ష్యంతో బీఈడీ పూర్తి చేసి డీఎస్సీకి సిద్ధమవుతోంది.
డీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాత్రి భోగాపురం ఎయిర్పోర్టుకు రానున్నారు.
రానున్న రెండు నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి కోరారు.
ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాకిట్లను శతశాతం విద్యార్థులకు పంపిణీ చేసినట్టు విద్యాశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్జేడీ విజయభాస్కర్ తెలిపారు.
గ్రామాల్లో రైతులు సాగు చేసే పంటల వివరాలను శాట్లైట్ ద్వారా నమోదు చేస్తున్నామని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు తెలిపారు.
శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం ముందురోజు ఓ మహిళ అర్ధాంతరంగా తనువు చాలించి.. ఇటు కన్నవారికి, అటు కట్టుకున్న భర్తకు తీరని క్షోభ మిగిలించింది.
జిల్లాలోని ప్రధాన మార్కెట్లు శ్రావణశోభను సంతరిం చుకున్నాయి. రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు, లక్ష్మీదేవి పూజలకు అవసరమైన వస్తు సామగ్రి, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో గురువారం పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరుతో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ మార్కెట్లు, షాపులు కిటకిటలాడాయి.
ఇసుకాసురులు పెట్రేగిపోతున్నారు. ఎటువంటి అను మతుల్లేకుండా జిల్లా నుంచి ఒడిశాకు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ప్రధానంగా కొమరాడ మండలం చోళ్లపదం రీచ్ నుంచి రోజూ అనధికారికంగా వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.
సాలూరు, పార్వతీపురం మున్సిపాల్టీలను ఎన్నికల నుంచి మినహాయించినట్లు వస్తున్న వార్తలపై ఆయా అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు సాలూరు మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల పునర్వి భజన అంశంపై హైకోర్టులో రెండు కేసులు ఉన్నట్టు కమిషనర్ రత్నకుమార్ గురువారం తెలిపారు.
ఇది మక్కువ మండలం కవిరిపల్లి-తెలగడవలస రోడ్డు. మట్టి రహదారిలా కనిపిస్తున్నా.. ఇది ఒకప్పుడు బీటీ రోడ్డే. 2018లో రూ.కోటి 20లక్షల ‘ఉపాధి’ నిధులతో బీటీ రోడ్డును నిర్మించారు. అయితే పనుల్లో నాణ్యతా లోపాల కారణంగా రోడ్డును నిర్మించిన అనతికాలంలోనే పాడై ఇలా మట్టిరోడ్డులా మారింది.