Sir CM.. Here it is! జిల్లా అభివృద్ధికి సంబంధించి బుధవారం కీలక అడుగు పడే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి ఎమ్మెల్యేలకు ఇప్పటికే సమాచారం అందింది. వారు మంగళవారం అమరావతికి బయలుదేరి వెళ్లారు.
IVRS Calls to Parents of Tribal Students సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న 47ఆశ్రమ పాఠశాలలు, పోస్టుమెట్రిక్ వసతిగృహాల పనితీరుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. దీనిలో భాగంగా ప్రతి నెలా మొదటివారంలో ఆయా పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తోంది.
No Gas… No Firewood Available! పశ్చిమాసియా యుద్ధం ప్రభావం గ్యాస్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో గ్యాస్ సిలిండ్ల సరఫరా కావడం లేదు. దీంతో మన్యంవాసులకు కష్టాలు తీరడం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తున్నారు.
Relief for Tribal Farmers from ‘Worry’ ఏజెన్సీలో చింతపండు సేకరించే గిరిజన రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. కిలో చింతపండు ధరను రూ.55కు పెంచి వారి చింతను తీర్చింది. వాస్తవంగా గిరిజన రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల ప్రభుత్వం కిలో చింతపండు ధరను రూ.36 నుంచి రూ.45కు పెంచింది. అయితే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర , పంట దిగుబడి ఇతర పరిస్థితుల రీత్యా.. అదనంగా మరో రూ.10 పెంచింది.
Mass Kolatam Performance on 22nd with 6,000 Participants గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఈ నెల 22న భారీ స్థాయిలో కోలాటం ప్రదర్శనను నిర్వహించనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర్రెడ్డి తెలిపారు.
Lorry Overturns on Ghat Road పాచిపెంట మండలం కంకణాపల్లి ఘాట్రోడ్డులో ( ఏవోబీలో 26వ నెంబరు హైవే) సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఒడిశా నుంచి విశాఖకు బియ్యం లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Change of Panchayat Special Officers జిల్లాలోని 451 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లతో పాటు ఎంఈవో-1లు 40 మంది, ఎంఈవో-2లు 34 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. అయితే ఎంఈవోలను ఆ విధులు నుంచి తప్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
At One’s Own Whim…! తురకనాయుడువలసలో ఎర్రగొల్ల సామాజిక వర్గానికి చెందిన వారిలో కొందరికి ఎస్టీ, మరికొందరికి ఎస్సీ, ఇంకొందరికి బీసీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. ఒక్క జియ్యమ్మవలస మండలంలోనే కాదు.. జిల్లాలో చాలాచోట్ల అధికారులు ఇలా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. దీంతో తమ సామాజిక వర్గం ఏమిటో తేల్చాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
జల సంరక్షణే లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి కోరారు.
Walking 5 Kilometers… Crossing Stones and Rough Terrain… గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. ప్రధానంగా రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వేళల్లో వైద్య సేవలు పొందేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.