Home » Andhra Pradesh » Vizianagaram
తెలంగాణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు.
‘మేమంతా క్షేమంగా ఉన్నాం. మా కోసం ఎలాంటి ఆందోళన చెందవద్దు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డీన్లు, ఇతర సిబ్బంది మాకు అండగా ఉంటున్నారు. మాకెలాంటి ప్రమాదం లేదు. పరిస్థితి విషమిస్తే రెండు మూడురోజుల్లో ఇండియాకి పంపిస్తామన్నారు.’
విజయనగరం పట్టణంలోని గంటస్తంభం సమీ పంలోని చెత్త కుండీలో ఓ శిశువు మృతదేహాన్ని స్థానికులు శనివారం సాయంత్రం గుర్తించారు.
తెలంగాణ రాష్ట్ర ఈఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. పాలకొండ మండలం యరకారాయపురం గ్రామానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య ఇంజనీరింగ్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.
జిల్లాలో పలు కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. దీంతో ఇన్చార్జిలే దిక్కుగా మారారు. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీశాఖ, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించి కీలక పోస్టుల్లో పూర్తిస్థాయి అధికారులు లేరు. కింది స్థాయి సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించారు. నెలల తరబడి వారితోనే నెట్టుకొస్తున్నారు తప్ప ఆయా పోస్టులను భర్తీ చేయడం లేదు
జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేక.. పంటను విక్రయించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు వారిని కలవరపెడుతున్నాయి.
. ఓటుహక్కుపై బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో ఎంతగా అవగాహన కల్పించినా.. వారి తీరు మారలేదు. ఈ నెల 13న జరిగిన పోలింగ్లో జిల్లాలో 1,76,376 మంది ‘మనకెందుకులే’ అనే ధోరణితో వ్యవహరించి.. ఓటుకు దూరంగా ఉండిపోయారు.
ఓట్ల లెక్కింపు నిర్వహణపై అలసత్వం వహించరాదని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు. ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు, పరిసర ప్రాంతాలను శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి పరిశీలించారు.
జిల్లాలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇన్చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో టెన్త్ పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
మల్లి గ్రామ సమీపంలోగల గురుకుల ప్రతిభా కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికిగాను దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.