స్వచ్ఛాంధ్రకు సహకరించాలి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:50 PM
కొత్తవలస మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శుక్రవారం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్యే లలితకుమారి
లక్కవరపుకోట(కొత్తవలస), ఫిబ్రవరి 20(ఆంరఽధజ్యోతి): కొత్తవలస మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శుక్రవారం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. స్వచ్ఛాంధ్రకు అందరూ సహకరించాలని ఆమె అధికారులను కోరారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం మండలానికో స్వచ్ఛ రథం కేటాయిం చిందని తెలిపారు. వ్యర్థాల సేకరణ వేగవంతం చేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందంజలో ఉంచా లని కోరారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. పారిశుధ్య కార్మికుల కు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎ స్ అధ్యక్షులు కోళ్ల శ్రీను, కనకల శివ, జనసేన సమన్వ యకర్త ఒబ్బిన సత్యనారాయణ, టీడీపీ పార్లమెంటు ఉపాధ్య క్షుడు గొరపల్లి రాము, బీసీ సెల్ అధ్యక్షుడు బొబ్బిలి అప్పారావు, దుర్గా ఉమేష్, కొరుపోలు అప్పారా వు తదితరులు పాల్గొన్నారు.