Another chance! వారి పరిస్థితి తెలుసుకుంటున్న అధికారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి ఇప్పటివరకు దరఖాస్తు చేయలేని వారికి, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారికి ఉపశమనం. దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకూ ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి గత నెల 30తోనే గడువు ముగిసింది కానీ దరఖాస్తుదారుల విన్నపం మేరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రెవెన్యూ వసూళ్లను ముమ్మరం చేసి నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని నగరపాలకసంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. బుధవారం విజయనగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి, సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అలాగే సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు త్పపవని నల్లనయ్య తెలిపారు. నగరంలోని రింగురోడ్డు,తోటపాలెం, రాజీవ్నగర్ కాలనీల్ల్లో ఆయన పర్యటించారు.
భూములను తీసుకున్న సమయం లో ఇచ్చిన హామీలను కాగితాలకు పరిమితం చేశారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆరోపించారు. విజయనగరంలో గురువారం జరగనున్న జిల్లా సమీక్ష సమావేశంలో జిందాల్ భూ నిర్వాసితుల సమస్యను ప్రస్తావిస్తానని తెలిపారు.
Will They Respond… Will They Resolve It? టెన్త్, ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నా.. విద్యాశాఖను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. మౌలిక వసతులు, భవనాల కొరతతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖను సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది.
మార్కెట్కు అనుగుణంగా రైతులు పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కోరారు. రైతులు చిరుధాన్యాలు పండించ డంపై దృష్టి సారించాలని తెలిపారు.
Instructors to teach ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
At a Rapid Pace… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పర్యటన నేపథ్యంలో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం భామిని ఆదర్శ పాఠశాల వద్ద చేపడుతున్న పనులను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షించారు. సభా వేదిక, హెలీప్యాడ్, ఇతరత్రా పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదే శించారు.
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేయాలని, దీని కోసం వారి పేర్లు నమోదుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులు ఆదేశిం చారు.ఇళ్ల స్థలాలకోసం పేర్లు నమోదు చేసుకోవడానికి ఈనెల 14 వరకూ ప్రభుత్వం గడువు ఇచ్చిందని,ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేసి నమో దు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Elephant Rampage in Chintalabelagam మండలంలోని చింతలబెలగాం పంచాయతీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం వేకువజామున సుర్ల కురిమినాయుడు అనే రైతుకు చెందిన 30 బస్తాల ధాన్యాన్ని, దుక్కి యంత్రాన్ని ధ్వంసం చేశాయి. సుర్ల శంకర్ అనే మరో రైతుకు చెందిన రెండు బస్తాల ధాన్యాన్ని నాశనం చేశాయి.
Grading of teachers on screen ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గ్రేడింగ్ విధానం మరోసారి తెరపైకి వచ్చింది. అటుగా ప్రభుత్వం దృష్టిసారించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా గ్రేడింగ్ విధానం తీసుకురాగా అప్పట్లో కేవలం బదిలీల సమయంలోనే అమలు చేసింది. ప్రస్తుతం మరింత వినూత్నంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై లోతుగా కసరత్తు జరుగుతోంది. ఈ అంశంపై ఉపాధ్యాయుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.