Home » Andhra Pradesh » Vizianagaram
‘బొబ్బిలికి చరిత్రలో ఎంతో పేరు ప్ర ఖ్యాతులు ఉన్నాయి. ఆ ఖ్యాతిని మరిం తగా ఇనుమడింపజేసే విధంగా రాజకీ యాలలో సేవలందించాలన్న లక్ష్యంతో పని చేస్తాను’ అని బొబ్బిలి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) అన్నారు.
నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు 2009లో తప్ప ఓటమే ఎరుగని నేత. అప్పుడు కూడా కేవలం 597 ఓట్ల తేడాతోనే ఓటమి చెందారు.
ఏ ప్రాంతానికైనా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తారు. ఏవోబీలోని కొఠియావాసు లకు మాత్రం బ్రిటిష్ కాలం నుంచి ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించడం విశేషం.
రాజాం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ స్పష్టం చేశారు. గత రెండు ఎన్నిక ల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేసిన ప్రజలు తప్పు చేశామని పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు.
పోస్టల్ ఓటింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. జేఎన్టీయులో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను ఆమె బుధవారం పరిశీలించారు. వీలైనంత వేగంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా సాధారణ పరిశీలకుడు తలాత్ పర్వజ్ ఇక్బాల్ రోహిల్లా కోరారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన బైక్ ర్యాలీని అసిస్టెంట్ కలెక్టర్ త్రివినాగ్తో కలిసి ప్రారంభించారు.
గన్ ప్రభుత్వం తమ సభలు, సమావేశాలకు ఆర్టీసీ బస్సులను నచ్చినట్టుగా వాడుకుంది. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా తరలించుకుపోయింది. బస్సుల సామర్థ్యం పెంచడానికి కాని కొత్త బస్సుల కొనుగోలుపై కాని దృష్టిసారించలేదు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం చీపురుపల్లి రానున్నారు. ఉదయం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరగనున్న సభలో ఆయన పాల్గొంటారు.
పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా మూసేసింది. ఒక పూట టిఫిన్, రెండు పూటల భోజనం చౌకగా అందించడంతో ఎంతోమంది పేదలు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు రోజూ వాటిని ఆశ్రయించేవారు. రూ.5 చెల్లించి తృప్తిగా భోజనం చేసేవారు. ప్రభుత్వం మారాక చంద్రబాబుపై కక్షతో జగన్ వాటన్నింటినీ ఉన్నఫలంగా మూసేశారు. ఆ భవనాల్లో కొన్నింటిని ఇతర కార్యాలయాలకు ఉపయోగించారు. మిగతావాటిని అలాగే వదిలేశారు. అన్న క్యాంటీన్లు మూత పడ్డాక పేదల నుంచి చాలా వ్యతిరేకత వచ్చినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
అన్న క్యాంటీన్లలో రూ.15కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం లభించడంతో వారికి ఖర్చులు బాగా కలిసివచ్చేవి. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే సీన్ మారింది. పేదలకు అన్న క్యాంటీన్ భోజనం దూరం చేశారు. పట్టణాల్లో వాటిని వార్డు సచివాలయాలుగా మార్పుచేశారు. కొన్నిచోట్ల అన్నక్యాంటీన్ల కోసం నిర్మించిన అవుట్ లెట్లను వేరే అవసరాలకు వినియోగించారు.