“Once Full of Rocks… Now Like a Mirror!” కూటమి ప్రభుత్వం చొరవతో సీతంపేట ఏజెన్సీ లోని పలు గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రాళ్లు తేలి.. అధ్వానంగా దర్శనమిచ్చిన రోడ్లు.. నేడు అద్దంలా మెరుస్తుండడంతో గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాలకు మే నెలలో సెలవులు ప్రకటించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
“River at the Threshold” ఎండల తీవ్రత దృష్ట్యా తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 102.21 మీటర్ల మేర నిల్వ ఉంది. రోజురోజుకూ నీరు తగ్గుముఖం పడుతుండ డంతో ఖరీఫ్ సాగుకు ఇబ్బందులు తప్పవేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
క్రికెట్ బెట్టింగులకు పాల్పడి జీవి తాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు.
మండలంలోని బీజేపురం పంచాయతీని ఏప్రిల్ 15లోగా ముస్తాబుగా తీర్చిదిద్వాలని ఎంపీడీవో హరిప్రసాద్, సచివాలయ సిబ్బందిని డీపీవో కొండలరావు ఆదేశించారు.
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం డాకమర్రి వద్ద మంగళవారం 10-30 గంటలకు ఓ కారు అదుపు తప్పింది.
టిడ్కో గృహలను లబ్ధిదారులకు అందజేయాలని సీపీఎం డిమాండ్చేసింది. ఈ మేరకు మంగళవారం మునిసిపల్ కార్యాలయాన్ని సీపీఎం ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ 768 ఇళ్లకు గాను 90 శాతం నిర్మాణం పూర్తయినా ఏదో ఒక షాకుతో లబ్ధిదారులకు అప్పగించడం లేదని ఆరోపించారు.
మండలంలోని అర్దానపాలెం గ్రామ సమీపంలో ఆదర్శ పాఠశాల వద్ద రోడ్డు పక్కనున్న మదుము కింద సుమారు 50ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మంగళవారం మండలంలోని కందివలస, కంబవలసల్లో 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు వల్ల ప్రజల స్థితిగతులు మారుతాయన్నారు. కందివలసలో శ్మశానానికి దారిలేకపోవడంతో ప్రస్తుతం నిర్మించిన సీసీ రోడ్డు వల్ల పొలాలు, శ్మశానానికి వెళ్లేందుకు ఉపయో గపడుతుందన్నారు.
అడ్డాపుశీల వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింద ని, జూన్ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాలు కల్పిం చిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.