మండల కేంద్రం కొమరాడ పంచాయతీలో నిధులు దుర్వినియోగానికి పాల్పడిన నలుగురు సచివాలయ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
వారంతా స్నేహితులు. ముందురోజు జరిగిన తన మిత్రుడి వివాహంలో అంతా కలిసి సందడి చేశారు.
భగవాన్ సత్యసాయిబాబా ఇచ్చిన ఉపదేశాలు సమాజానికి శాశ్వత మార్గదర్శకాలు అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బాలికలకు స్వీయ రక్షణ అవసరమని కలెక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి అన్నారు.
“River at Their Doorstep… Yet Irrigation a Struggle! వంశధార నదీతీరాన భామిని మండలం ఉన్నా.. ఈ ప్రాంత రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఏటా వరుణుడిపైనే ఆధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది. వరదల సమయంలో భూములు కోతకు గురవుతుండగా.. వంశధార వరద కాలువలు మండల రైతులకు శాపంగా మారాయి.
Monitoring Through an App గిరిజన విద్యా సంస్థల పనితీరు మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఏఐతో కూడిన హాస్టల్ ఫెర్ఫార్మెన్స్ మానటరింగ్ సిస్టం (హెచ్పీటీఎస్) యాప్ను తీసుకొచ్చింది. దీని ద్వారా గిరిజన విద్యా సంస్థలను పర్యవేక్షిస్తూ.. సమస్యలను పరిష్కరించనున్నారు. హాస్టళ్లలో పొరపాట్లు, అవకతవకలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోనున్నారు.
Funds Utilization… A Free-for-All జిల్లాలో వివిధ పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల మేరకు వినియోగించడం లేదు. అనధికార పనులకు ఇష్టారాజ్యంగా వెచ్చిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది.
From Peddagedda to Salur పెద్దగెడ్డ నుంచి సాలూరు మున్సిపాలిటీ వాసులకు తాగునీరందించేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు శనివారం పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ చీఫ్ ప్రభాకరరావు పెద్దగెడ్డ ప్రాజెక్టును పరిశీలించారు.
Helping Hands Standing by Patient ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల కోసం హెల్పింగ్ హ్యాండ్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
Check on Bogus musters ఉపాధి హామీ పథకంలో బోగస్ మస్తర్ల నిరోధానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇకపై ఈకేవైసీ పూర్తయిన వేతనదారులకే పనులు కల్పిం చనున్నారు. అయితే ఇప్పటివరకు ఈకేవైసీ చేసుకోని వారికోసం గరుగుబిల్లి మండలంలో శని వారం గ్రామసభలు నిర్వహించారు.