ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:17 AM
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పోస్టుకార్డుల ద్వారా లేఖలను పంపించారు.
కొత్తవలస, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పోస్టుకార్డుల ద్వారా లేఖలను పంపించారు. పీఆర్సీ కమీషన్ను ఏర్పా టు చేయాలని, 29 శాతం ఐఆర్ను ప్రకటించాలని, ఐద్యోగుల, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, సీపీఎస్ను రద్దు చేయాలని కోరారు. యూటీఎఫ్ నాయకులు జి.పార్వతి, జి.వెంకటనాయుడు, వి.సురేష్ కుమార్, సీహెచ్ నిర్మలాదేవి, జి.విజయగౌరి, సూరిఅప్పారావు పాల్గొన్నారు.