పట్టణంలో పశుసంచారంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పెంపకందారులకు నోటీసులు జారీచేయాలని బొబ్బిలి మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి ఆదేశించారు.
బొబ్బిలిలోని స్వామి వారి వీధిలో గల పోస్టాఫీసు సమీపంలోని గ్రూపు హౌస్లో ఆలవెల్లి వెంకటరావు (31) సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసున్నాడు.
సీతానగరం మండలంలోని జోగింపేట గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎరుకునాయుడు చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బత్తిన మోహన్రావు, టి.గౌరీ శంకరరావు, రంజిత్కుమార్ డిమాండ్ చేశారు.
Ministers to visit Model School today భోగాపురం పీఎంశ్రీ ఏపీ మోడల్స్కూల్ను మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సందర్శించనున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటన ఉండడంతో కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి సోమవారం స్కూల్ని సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
students facing problems చిన్న పిల్లలు పెద్ద కష్టాలు పడుతున్నారు. చదువుకోవడానికి కొండలు దిగుతున్నారు. వాగులు దాటుతున్నారు. పొదల నడుమ నడుస్తున్నారు. ఆపై రహదారి రెయిలింగ్ కిందకు దూరి ఆవలకు చేరుకుంటున్నారు. దాదాపు 2 కిలోమీటర్లు పైబడి అవస్థలు పడుతూ కాలినడకన పాఠశాలకు చేరుకుంటున్న జీలికవలస గ్రామ గిరిజన విద్యార్థుల కష్టాలు చూసేవారెవరైనా నిర్ఘాంతపోవాల్సిందే.
I gave a complaint. but there was no response. తన భూమి సమస్య మీద కలెక్టర్కు లెటర్ పెట్టి ఏడాదైందని, చివరిగా నాలుగు నెలల కిందట మరోసారి ఆయన దృష్టిలో పెట్టానని, ఇప్పటికీ స్పందన లేదని గోవా గవర్నర్ పూసపాటి అశోక్గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలోని తన బంగ్లాలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో లేనివారు వారికి అనుకూలంగా పనులు చేసుకుంటున్నారని, చట్టాల్ని చుట్టాలుగా చేసుకున్నవారు, అధికార దుర్వినియోగానికి పాల్పడినవారు ఈరోజు మాట్లాడుతున్నారని నిరాశ వ్యక్తం చేశారు. అధికారుల తీరు సరైంది కాదని, తమకు చట్టం మీద నమ్మకం ఉందని, ఆ నమ్మకానికి పరీక్ష పెట్టొద్దని హితవు పలికారు.
There are no seeds. how is that? జూన్ ముగుస్తోంది. ఇంతవరకు ఆకు మడిలో వరి విత్తనాలు చల్లలేదు. జూలైలో సక్రమంగా వర్షాలు పడినా వరి నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనాల కోసం వ్యవసాయ అధికారులను అడిగితే అదిగో, ఇదిగో అంటున్నారు. ఎప్పటికి ఇస్తారో స్పష్టత ఇవ్వడం లేదు. ప్రైవేటు డీలర్లు ఎక్కువ ధర చెబుతున్నారు. రెండు, మూడు రోజులు చూసిన తరువాత వారి వద్దకు వెళ్లడం తప్పదేమో అని జిల్లా సగటు రైతు ఆవేదన చెందుతున్నాడు. వ్యవసాయ శాఖ తీరుపై నిరాశ వ్యక్తం చేస్తున్నాడు.
Fevers Are Turning Fatal మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. మలేరియా, విషజ్వరాలతో గిరిజనులు మంచం పడుతున్నారు. మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అయితే ఈ జ్వరాలతో వరుసగా విద్యార్థులు మృత్యువాత పడుతుండడం జిల్లావాసులను కలవరపరుస్తోంది.
Not a Single Death Should Occur జ్వరాలతో జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించరాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
Build It, Reap Prosperity! కురుపాం నియోజకవర్గంలో గుమ్మిడిగెడ్డ రిజర్వా యర్ నిర్మాణం ఎన్నికల హామీగా మారింది. ఏళ్లు గడుస్తున్నా.. నిర్మాణం దిశగా అడుగులు పడడం లేదు. 1978లో గుమ్మిడిగెడ్డపై నిర్మించిన ఆనకట్ట పరిస్థితి కూడా దయనీయంగా మారింది. దీంతో మూడు మండలాల రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.