We Have Reduced Ganja Cultivation in North Andhra ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏడాది గంజాయి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించగలిగామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. సోమవారం ఎల్విన్పేట పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు.
Civil Services Coaching for Tribal Youth సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ఇన్చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు.
రైతుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, ఎస్.కోట పీఎసీఎస్ చైర్మన్ జీఎస్ నాయుడు,డైరక్టర్ గెదెల శ్రీను తెలిపారు. సోమవారం మండలంలోని వెంకటరమణపేటలో ఏవో రవీంద్ర ఆధ్వర్యంలో ధాన్యం కోనుగోలు కేంద్రం ఏర్పా టుచేశారు.
జిందాల్భూసేకరణలో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించి న్యాయ విచారణ జరి పించాలని ఎమ్మెల్సీ ఇందుకూరిరఘురాజు కోరా రు. సోమవారం బొడ్డవరలో ఆయన విలేకరు లతో మాట్లాడుతూ జిందాల్ నిర్వాసితులు ఎలా మోసపోయామో నిరసన దీక్షల ద్వారా తెలుసు కున్నారని, ఇన్నాళ్లు జిందాల్ ముసుగు వేసి భూములను ఏవిధంగా దోచుకున్నారో తెలుసు కున్నారన్నారు.
:సంక్షేమబోర్డును పునరుద ్ధరించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షుడు రామ్మూర్తినాయు డు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది భవననిర్మాణ కార్మికులపై పభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
What is really happening? తహసీల్దార్ కార్యాలయాలకు తరచూ ఎవరెవరు వస్తున్నారు? ఏమేమి చేస్తున్నారు.. భూముల లావాదేవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? తహసీల్దార్లకు ఎవరెవరు సహకారం అందిస్తున్నారు? తదితర అంశాలపై నిఘా పెట్టినట్లు సమాచారం.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్ తెలిపారు. సోమవారం మండలంలో రామతీర్థంలో అన్నదాత సుఖీభవ, రైతన్నా మీకోసం వారోత్సవాల్లో భాగంగా పర్యటించారు.కార్యక్రమంలో గేదెల రాజారావు, తాడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
Don't ruin life మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడి అరెస్టు అయితే జీవితం నాశనం అవుతుందని, భవిష్యత్తు అంధకారమేనని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతో విశాఖ రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పాయకరావుపేట నుంచి మొదలైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు వెళ్తుంది. 13వ రోజు సోమవారం నగరంలోని కోట జంక్షన్కు చేరుకున్న ర్యాలీలో డీఐజీ మాట్లాడారు.
Supporting the heart..! నెల్లిమర్లకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు టెనెక్ట్ప్లస్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. తరువాత విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నాడు. రెండు స్టంట్లు వేయడంతో ప్రాణాలు నిలుపుకుని ఇంటికి క్షేమంగా చేరాడు. కాగా ఈ ఇంజెక్షన్ ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. ఇది పేద ప్రజలకు కొండంత ‘గుండె’భరోసా.
సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేసిన ఆయా సంఘాల నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ దద్దరిల్లింది. అనంతరం జిల్లా అధికారులకు ఆయా సంఘాల నాయకులు వినతిపత్రాలు అందజేశారు.