పార్వతీపురం, సీతంపేట ఐటీడీల పరిధిలో రెండు ప్రత్యేక మలేరియా నివారణ విభాగాలు ఉన్నా.. జ్వరాలు అదుపులోకి రావడం లేదు. రోజురోజుకూ మలేరియా విజృంభిస్తోంది.
No Payments for Five Months! కేంద్రం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన వీబీ జీ రామ్జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవిక మిషన్) పథకాన్ని జిల్లాలో బుధవారం నుంచి అమలు చేయనున్నారు. అయితే జూన్ నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకంలో పూర్తయిన నిర్మాణాలు, వివిధ దశల్లో ఉన్న పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు కాలేదు.
మాదకద్రవ్యాలపై నిఘా పెంచాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలం వివాదంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డులను పరిశీలించి ఆ స్థలాన్ని తిరిగి అశోక్ గజపతిరాజుకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. అనంతరం వారు భోగాపురం నుంచి విశాఖపట్నానికి బయలుదేరారు.
రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.రాము డిమాండ్ చేశారు.
రైతులు ఏరువాక పౌర్ణమిని తొలి పండగగా భావించి వ్యవసా య పనులు చేపట్టడం సంతోషదాయకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆల యాల నిర్మాణం, అభివృద్ధికి శ్రీవాణి ట్రస్టు నిధులు విని యోగిస్తున్నట్లు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలి పారు.
నగరంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 2023లో నమోదైన గంజాయి కేసులో నగరంలోని గోక పేటలో నివాసం ఉంటున్న బొంతు వెంకటేశ్వరరావుకు మూడేళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.30వేలు జరిమానా విధిస్తూ ఏడీజే, ఎన్డీపీఎస్ యాక్టు స్పెషల్ న్యాయాధికారి కె.విజయకళ్యాణి సోమవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోద ర్ తెలిపారు.