కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ నాయకుడు బి.సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు భోగాపురంలో బుధవారం బ్లాక్ డే పేరుతో లేబర్కోడ్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు జి.ప్రవీణ, శ్రీలక్ష్మి, అనిత పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశం గురించి వైసీపీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున కోరారు.
చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయమని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు నెలకు 500 యూనిట్లు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు.
జిల్లాలోని రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో జాప్యం చేస్తే తగదని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరే ట్ నుంచి రెవెన్యూ అధికారులతో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సమావేశం లో మాట్లాడారు.
Will They Care Only After It Collapses? తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువపై ఉన్న కల్వర్టు పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. ఇది కూలితే.. ఆంధ్రాతో పాటు ఒడిశాకు పూర్తిగా రాకపోకలు స్తంభించనున్నాయి. వాస్తవంగా బ్రిటిష్ వారి హయాంలో నిర్మించిన ఈ కల్వర్టుకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు.
Will Those Two Assembly Seats Be Reserved for Women? అన్ని రాష్ర్టాల్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని భావిస్తోన్న కేంద్రం.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లును కూడా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదింపజేయాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఇదే జరిగితే డీలిమిటేషన్ తర్వాత జిల్లాలో మరో రెండు నియోజకవర్గాలు పెరగనుండగా.. అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆరుకు చేరనుంది. ఇక 33 శాతం రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే.. రెండు నియోజక వర్గాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Tribal Areas to Be Developed as ‘Model Villages’ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలక అడుగు పడింది. ప్రధానంగా పీవీటీజీలు నివసించే గ్రామాలను మోడల్ విలేజ్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గదబ, సవర వంటి తెగలకు చెందిన గిరిజనుల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు కేటాయించనున్నారు.
SA-2 Exams from the 6th జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 6 నుంచి 16 వరకు ఎస్ఏ-2 (సమ్మెటివ్ అసెస్మెంట్-2) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధ వారం జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు అందాయి.
Strict Action Against Those Engaging in Betting ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్లకు దిగితే కఠిన చర్యలు తప్పని ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... జిల్లా యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.
NEET Coaching Center in Model School అక్కివరం ఏపీ మోడల్ స్కూల్లో నీట్ శిక్షణ కేంద్రం బుధవారం ప్రారంభమైంది. ఉమ్మడి 5 జిల్లాల ఏపీ మోడల్ స్కూళ్ల నుంచి ఎంపిక చేసిన వంద మంది విద్యార్థినులకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.