జిల్లాలో నేరాలను అరికట్టేందుకు, శాంతిభద్రత లను పరిరక్షించేందుకు కఠిన చర్యలు చేపడు తున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం తెలిపారు.
డాక్టర్.. ఐ లవ్ యూ అంటూ నిత్యం పదుల సంఖ్యలో మెసేజ్లు, ఫోన్లు చేస్తూ ఓ వైద్యురాలిని వేధిస్తున్న వ్యక్తిని రాజాం పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకు న్నారు.
ఏపీలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్ములమడుగు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా భూమిపూజ చేశారు.
ఉపాధి హామీ పనులతో వేతనదారులకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిన్నాం గ్రామంలోని తామరచెరువులో వీబీజీ రామ్జీ(ఉపాధి హామీ) పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.
జిందాల్ భూముల్లో నిర్మితమయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎఈ) పరిశ్రమలపై నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధికి తప్పకుండా భరోసా లభిస్తుందని ఆశ పడుతున్నారు. వలస వెళ్లాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండబోదని భావిస్తున్నారు.
గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల సంరక్షకురాలు హేమను గురువారం గరుగుబిల్లిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు.
పంటల మార్పిడి వైపు దృష్టిసారిం చాలని కురుపాం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసరావు సూచించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని చీపురుపల్లి ఆర్డీవో, ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్ ఎం. సుధారాణి కోరారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంక టరావు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం సామాన్యుల నుంచి, మహారాజుల వరకు ఎవర్నీ వదలకుండా ఇబ్బందులను పెట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అశోక్ గజపతిరాజును ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని తెలిపారు.