జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా పిల్లలకు మాత్రలు అందేలా చూడాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జీవనరాణి ఆదేశించారు.
బొబ్బిలి మం డల పరిషత్ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో ఎంపీడీవోల తో డీడీవో ఎం.కిరణ్కుమార్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
Achieve the best rank మునిసిపాలిటీలు స్వచ్ఛసర్వేక్షణ్లో ఉత్తమ ర్యాంకుల కోసం పోటీ పడాలని, చెత్త నిర్వహణ, పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని మునిసిపల్ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రవీంద్ర సూచించారు. ర్యాంకుల సాధన కోసం అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు సోమవారం బొబ్బిలి వచ్చిన ఆయన రామన్నదొరవలసలోని సాలిడ్వేస్ట్మేనేజ్మెంట్ పార్కును, కృష్ణాపురం రోడ్డులోని పాత డంపింగ్ యార్డును పరిశీలించారు.
తమపై పనిభారం తగ్గించాలని కోరుతూ తహసీల్దారు బి.సుదర్శనరావుకు వీఆర్వోలు సోమవారం వినతిపత్రం సమర్పించారు.
Cooperative employees' strike ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ( పీఏసీఎస్) పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఏడాది నవంబరు నుంచే దశలవారీగా నిరసన తెలియజేస్తున్నారు.
Elections? Extension? గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఐసీ (పర్సన్ ఇన్చార్జి)లను ప్రభుత్వం కొనసాగిస్తుందా? తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుందా? అన్న దానిపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో పశు సంవర్ధక శాఖాధికారులు తర్జన, భర్జన పడుతున్నారు.
Does Rajam have that Rajasam dream? c పారిశ్రామిక ప్రగతిలో జిల్లా రోజురోజుకు దిగజారుతోందని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సూచీలో తేటతెల్లమైంది. ఈ మాట విన్న జిల్లా ప్రజలకు వెంటనే గుర్తుకొచ్చిన ప్రాంతం రాజాం. పారిశ్రామిక పట్టణంగా పేరొందిన ఈ ప్రాంతంలో 20కు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో జిల్లా స్థాయిలో ఆ ప్రభావం పడింది. పారిశ్రామికంగా వెనకబడిందనే ముద్ర వేసుకుంది. ఇటు రాజాంలో మూతపడిన వాటిలో ఒక్కటీ తెరుచుకోకపోగా కొత్తగా ఒక్క పరిశ్రమా రాలేదు. దీంతో పూర్వవైభవం కలేనా అని ఈ ప్రాంతీయులు నిరాశ చెందుతున్నారు.
పట్టణంలోని పాలకొండ-రాజాం రోడ్డులో ఉన్న కోటదుర్గ పాత ప్లాస్టిక్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
ప్రతి ఇంటికీ పారిశుధ్య సిబ్బంది వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించాలని విశాఖ రీజనల్ మునిసిపల్ ప్రాంతీయ సంచాలకుడు వి.రవీంద్ర ఆదేశించారు.
జంఝావతి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.